‘మెంటల్’ రచ్చ.! తగ్గేదేలే అంటోన్న బాలయ్య.!
- January 27, 2023అక్కినేని తొక్కినేని.. ఆ రంగారావు.. ఈ రంగారావు.. అంటూ ‘వీర సింహారెడ్డి’ సినిమా విజయోత్సవ సభ సందర్భంగా బాలయ్య చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అక్కినేని కుటుంబం నుంచి, నాగ చైతన్య, అఖిల్ సోషల్ మీడియా వేదికగా బాలయ్యకు చురకలు అంటించిన సంగతీ తెలిసిందే. సినీ రంగం నుంచే కాదు, రాజకీయంగానూ బాలయ్య వ్యాఖ్యలు హీట్ పెంచేశాయ్.
లెజెండరీ నటుల్ని అగౌరవపరిచేలా మాట్లాడతారా.? బాలయ్య క్షమాపణలు చెప్పాల్సిందే.. అంటూ పలు రకాలుగా బాలయ్యపై నెగిటివిటీ పోటెత్తింది. ఈ తరుణంలో బాలయ్య స్పందించారు. అక్కినేని నాగేశ్వరరావు అంటే తనకెంతో అభిమానమనీ, చాలా ఆప్యాయంగా మాట్లాడేవారనీ, తన పిల్లల కన్నా ఎక్కువ ప్రేమ చూపించేవారనీ ఎందుకంటే అక్కడ (అక్కినేని కుటుంబం) అభిమానం లేదు.. ఇక్కడ వుంది.. అని వివాదాన్ని నెక్స్ట్ లెవల్కి తీసుకెళ్లారు బాలయ్య.
దీంతో, నాగార్జునపై ఒత్తిడి పెరుగుతోంది. బాలయ్య నోటికి అడ్డుకట్ట పడాలంటే, నాగార్జున స్పందించాల్సిందే అంటూ అక్కినేని అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. చూడాలి మరి, ఈ రచ్చ ఎంత దూరం పోతుందో.
తాజా వార్తలు
- రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
- ఎయిరిండియా సిబ్బంది మూకుమ్మడిగా సెలవు..
- జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్దొద్దు: కోర్టును కోరిన సీబీఐ
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు మంచి రోజులు..!
- జహ్రా గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 66కు పెరిగిన సౌదీ ఇ-విజిట్ వీసా పూల్ దేశాలు
- దుబాయ్లో కొత్త ట్రాఫిక్ ప్లాన్ కు ఆమోదం
- క్యాబిన్ క్రూ సంక్షోభం.. తగ్గనున్న ఎయిర్ ఇండియా సర్వీసులు..!
- షేక్ హజ్జా బిన్ సుల్తాన్ బిన్ జాయెద్ మృతికి సంతాపం తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!