AM 2 PM సర్వీస్ ప్రారంభించిన TSRTC..
- January 27, 2023హైదరాబాద్: వినియోగదారులకు మరింత వేగవంతమైన సేవలందించేందుకు ‘AM 2 PM’ (AM 2 PM) పేరుతో నూతనంగా ఎక్స్ప్రెస్ పార్శిల్ సర్వీస్కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్లోని బస్ భవన్లో ఈ సేవల్ని సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ప్రయాణికుల టికెట్ ఆదాయంతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయంపై సంస్థ దృష్టి పెట్టిందని, అందులో భాగంగానే ఇప్పటికే పెట్రోల్ బంక్ల నిర్వహణ, లాజిస్టిక్తో పాటు స్వచ్ఛమైన జీవా వాటర్ బాటిళ్లను మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చామని ఎండీ సజ్జనర్ తెలిపారు. లాజిస్టిక్స్(కార్గో) సేవల ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయని, ఆ సేవలను వినియోగదారులకు మరింత వేగంగా, సురక్షితంగా అందించాలనే ఉద్దేశంతో ‘AM 2 PM’ సర్వీస్ను ప్రారంభించామన్నారు. హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నేటి నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయని సజ్జనార్ చెప్పారు.
‘AM 2 PM’ ఎక్స్ప్రెస్ పార్శిల్ సర్వీస్లో మధ్యాహ్నం 12 గంటల్లోపు బుక్ చేస్తే అదే రోజు రాత్రి 9 గంటలకు ఆ పార్శిల్ గమ్యస్థానానికి చేరుతుందని ఆయన తెలిపారు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 గంటల మధ్యలో బుక్ చేస్తే మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు వెళ్తుందని అన్నారు. ఈ సర్వీస్ పరిధిలోకి ఒక కేజీ పార్శిళ్లే వస్తాయని, వాటి విలువ రూ.5 వేలకు మించకూడదని స్పష్టం చేశారు. ఈ ఎక్స్ప్రెస్ సర్వీస్ కొరియర్ ధర రూ.99గా టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించినట్లు తెలిపారు. నగదు, యూపీఐ పేమెంట్స్ రూపంలో ఈ సేవలను పొందవవచ్చని వివరించారు. త్వరలోనే AM 2 PM ఎక్స్ప్రెస్ సర్వీస్ను ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తామని తెలిపారు. 5 కిలోల లోపు పార్శిళ్లను తిరుపతి, బెంగళూరు, కర్నూలు, విజయవాడ, తదితర నగరాలకు చేరవేస్తామని సజ్జనార్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ