AM 2 PM సర్వీస్ ప్రారంభించిన TSRTC..

- January 27, 2023 , by Maagulf
AM 2 PM సర్వీస్ ప్రారంభించిన TSRTC..

హైదరాబాద్: వినియోగదారులకు మరింత వేగవంతమైన సేవలందించేందుకు ‘AM 2 PM’ (AM 2 PM) పేరుతో నూతనంగా ఎక్స్‌ప్రెస్‌ పార్శిల్‌ సర్వీస్‌‭కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో ఈ సేవల్ని సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ప్రయాణికుల టికెట్‌ ఆదాయంతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయంపై సంస్థ దృష్టి పెట్టిందని, అందులో భాగంగానే ఇప్పటికే పెట్రోల్‌ బంక్‌ల నిర్వహణ, లాజిస్టిక్‭తో పాటు స్వచ్ఛమైన జీవా వాటర్‌ బాటిళ్లను మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చామని ఎండీ సజ్జనర్‌ తెలిపారు. లాజిస్టిక్స్‌(కార్గో) సేవల ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయని, ఆ సేవలను వినియోగదారులకు మరింత వేగంగా, సురక్షితంగా అందించాలనే ఉద్దేశంతో ‘AM 2 PM’ సర్వీస్‌ను ప్రారంభించామన్నారు. హైదరాబాద్‌ సహా తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నేటి నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయని సజ్జనార్ చెప్పారు.

‘AM 2 PM’ ఎక్స్‌ప్రెస్‌ పార్శిల్‌ సర్వీస్‌లో మధ్యాహ్నం 12 గంటల్లోపు బుక్ చేస్తే అదే రోజు రాత్రి 9 గంటలకు ఆ పార్శిల్ గమ్యస్థానానికి చేరుతుందని ఆయన తెలిపారు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 గంటల మధ్యలో బుక్‌ చేస్తే మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు వెళ్తుందని అన్నారు. ఈ సర్వీస్‌ పరిధిలోకి ఒక కేజీ పార్శిళ్లే వస్తాయని, వాటి విలువ రూ.5 వేలకు మించకూడదని స్పష్టం చేశారు. ఈ ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌ కొరియర్‌ ధర రూ.99గా టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించినట్లు తెలిపారు. నగదు, యూపీఐ పేమెంట్స్‌ రూపంలో ఈ సేవలను పొందవవచ్చని వివరించారు. త్వరలోనే AM 2 PM ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌ను ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తామని తెలిపారు. 5 కిలోల లోపు పార్శిళ్లను తిరుపతి, బెంగళూరు, కర్నూలు, విజయవాడ, తదితర నగరాలకు చేరవేస్తామని సజ్జనార్ స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com