జీవో నెంబర్ 1 గురించి ఆందోళన వద్దు:ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి
- January 28, 2023
అమరావతి: జీవో నెంబర్ 1 గురించి ఎలాంటి ఆందోళన వద్దని ఏపీ డిజిపి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్.1 పై విపక్షాలు భగ్గుమంటున్న నేపథ్యంలో డీజీపీ స్పందించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పోలీసుల జిల్లా రివ్యూ మీటింగ్ కు డీజీపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1 గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. ఈ జీవోతో ఎవరి కార్యక్రమాలను అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల సభలకు అనుమతి ఇచ్చామన్నారు. ఎవరైనా పాదయాత్రలు చేయాలనుకుంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ లో అనుమతి తీసుకోవాలని సూచించారు. జీవో వచ్చిన తర్వాత కూడా పొలిటికల్ పార్టీల మీటింగులకు అనుమతులు ఇచ్చామన్నారు.
తాజా వార్తలు
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!
- కువైట్ లో నీటి భద్రతకు భరోసా..లార్జెస్ట్ వాటర్ ప్లాంట్..!!
- తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు
- ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







