విజయవాడలోని ఎ-1 కన్వెన్షన్ సెంటర్లో మేడే వేడుకలు
- May 01, 2016
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలోని ఎ-1 కన్వెన్షన్ సెంటర్లో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి సుజనాచౌదరితో పాటు, పలువురు రాష్ట్రమంత్రులు, కార్మికశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రన్న బీమా పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. కోటి 50లక్షల మంది అసంఘటిత కార్మికులకు బీమా పథకం వర్తింపచేయనున్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. బీమా పథకం ద్వారా అసంఘటి రంగ కార్మికులు మరణిస్తే రూ.5లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్మిక సంఘాలు స్వార్థం వీడాలని, మారిన పరిస్థితులకు అనుగుణంగా యాజమాన్యాలు ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు. ప్రపంచీకరణలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోంది .. తక్కువ ఖర్చుతో నాణ్యంగా ఉంటేనే ఉత్పత్తులకు డిమాండ్ ఉంటుందన్నారు. రాయితీలు ఇచ్చి పరిశ్రమలకు ఆక్సిజన్ ఇచ్చామని పేర్కొన్నారు. విభజన మనం కోరుకున్నది కాదు.. అన్ని అన్ని రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందే వరకు కేంద్ర చేయూత ఇవ్వాలని కోరారు. ఇబ్బందులున్నా.. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు.కేంద్రమంత్రి సుజనాచౌదరి మాట్లాడుతూ.. కార్మికులే దేశానికి వెన్నెముక... కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న బీమా దేశంలో ఎక్కడా లేదన్నారు. కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. కార్మికులకు గృహ నిర్మాణాలపై యాజమాన్యాలతో చర్చిస్తున్నామన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు తెప్పించి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. కార్మికశాఖకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఆన్లైన్ ద్వారా అమలు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాథరెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, జలీల్ఖాన్, బొండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







