ఖతార్ లో 100% పైగా పెరిగిన విమాన ప్రయాణీకుల సంఖ్య
- January 31, 2023దోహా: 2022 సంవత్సరంలో ఖతార్ విమానయాన రంగం రికార్డు సృష్టించింది. గతేడాది 35 మిలియన్లకు పైగా విమాన ప్రయాణికులను నమోదు చేసినట్లు ఖతార్ పౌర విమానయాన అథారిటీ తెలిపింది. ఇది 2021తో పోలిస్తే 101.9% పెరుగుదలను నమోదు చేసింది.ఈ మేరకు 2022 సంవత్సరానికి సంబంధించిన ఎయిర్ ట్రాన్స్పోర్ట్ గణాంకాలను వెల్లడించింది. 2021లో హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 17,703,274 మంది ప్రయాణికులు రాగా, 2022లో 35,734,243 మంది ప్రయాణికులు ప్రయాణించారు. 2022 సంవత్సరంలో విమానాల సంఖ్య 28.2% పెరిగింది. 2021లో నమోదైన మొత్తం విమానాలు 169,909 కాగా 2022లో వీటి సంఖ్య 217,875 కి పెరిగింది.నవంబర్ 20 నుండి డిసెంబర్ 18, 2022 వరకు జరిగిన FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022కి ఖతార్ ఆతిథ్యం ఇవ్వడం వల్ల విమానాశ్రయంలో విమానాలు, ప్రయాణీకుల పరంగా గణనీయమైన పెరుగుదల నమోదు చేసుకుందని పౌర విమానయాన అథారిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..