ఖతార్ లో 100% పైగా పెరిగిన విమాన ప్రయాణీకుల సంఖ్య
- January 31, 2023
దోహా: 2022 సంవత్సరంలో ఖతార్ విమానయాన రంగం రికార్డు సృష్టించింది. గతేడాది 35 మిలియన్లకు పైగా విమాన ప్రయాణికులను నమోదు చేసినట్లు ఖతార్ పౌర విమానయాన అథారిటీ తెలిపింది. ఇది 2021తో పోలిస్తే 101.9% పెరుగుదలను నమోదు చేసింది.ఈ మేరకు 2022 సంవత్సరానికి సంబంధించిన ఎయిర్ ట్రాన్స్పోర్ట్ గణాంకాలను వెల్లడించింది. 2021లో హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 17,703,274 మంది ప్రయాణికులు రాగా, 2022లో 35,734,243 మంది ప్రయాణికులు ప్రయాణించారు. 2022 సంవత్సరంలో విమానాల సంఖ్య 28.2% పెరిగింది. 2021లో నమోదైన మొత్తం విమానాలు 169,909 కాగా 2022లో వీటి సంఖ్య 217,875 కి పెరిగింది.నవంబర్ 20 నుండి డిసెంబర్ 18, 2022 వరకు జరిగిన FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022కి ఖతార్ ఆతిథ్యం ఇవ్వడం వల్ల విమానాశ్రయంలో విమానాలు, ప్రయాణీకుల పరంగా గణనీయమైన పెరుగుదల నమోదు చేసుకుందని పౌర విమానయాన అథారిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







