ఒమన్లో చెక్-బౌన్స్ కేసులదే అగ్రస్థానం: 2022లో 13 హత్యలు
- January 31, 2023
మస్కట్: 2022లో ఒమన్ సుల్తానేట్లో నమోదైన అన్ని నేరాల్లో బౌన్స్ చెక్కులు అగ్రస్థానంలో ఉన్నాయని, మొత్తం 4518 కేసులు(14.9 శాతం) నమోదయ్యాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ హిస్ ఎక్సలెన్సీ నస్ర్ బిన్ ఖమీస్ అల్ సవాయ్ తెలిపారు. 2022లో పబ్లిక్ ప్రాసిక్యూషన్ డీల్ చేసిన కేసుల గణాంకాలను సమీక్షించే పబ్లిక్ ప్రాసిక్యూషన్ వార్షిక సదస్సులో ఆయన వెల్లడించారు. గత సంవత్సరంలో ప్రజా హక్కుల కోసం సేకరించిన మొత్తం OMR 12.418 మిలియన్లు అని, గత సంవత్సరం జారీ చేసిన మొత్తం తీర్పుల సంఖ్య 15,442కి చేరుకుందని.. వాటిలో 90.2% అమలు చేయబడ్డాయని ఎక్స్ లెన్సీ వివరించారు. విచారణ సెషన్ల మధ్య విరామాలను తగ్గించే యంత్రాంగాన్ని ఆమోదించడానికి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా ఉపయోగించుకోవడానికి ఒక ప్రణాళికపై పని చేస్తున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది.
2022లో 13 హత్యలు
2022లో జరిగిన హత్యల సంఖ్య 13కు చేరిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వార్షిక సదస్సులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డాక్టర్ అహ్మద్ బిన్ సయీద్ అల్ షుకైలీ వెల్లడించారు. 2021లో కూడా ఈ సంఖ్య 13గానే ఉందని తెలిపారు. హత్యలను అధ్యయనం చేయడానికి, వాటి కారణాలను తెలుసుకోవడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్ సమర్థ అధికారంతో సమన్వయంతో పనిచేస్తుందని అల్-షుకైలీ తెలిపారు.
తాజా వార్తలు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్
- ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- సోహార్లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!
- సౌదీ అరేబియాలో హాటెస్ట్ మంత్ గా జూలై ఉండబోతుందా?
- అండర్ 16 సోషల్ మీడియా బ్యాన్..ఆస్ట్రేలియా సంచలన స్టడీ..!!
- షాపింగ్ ప్రియులకు లూలూ హైపర్మార్కెట్ కువైట్ శుభవార్త..!!
- 52 మాగ్నెట్స్ మింగిన 5 ఏళ్ల బాలుడు..డాక్టర్లు ఏమన్నారంటే?
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్







