ఒమన్లో చెక్-బౌన్స్ కేసులదే అగ్రస్థానం: 2022లో 13 హత్యలు
- January 31, 2023
మస్కట్: 2022లో ఒమన్ సుల్తానేట్లో నమోదైన అన్ని నేరాల్లో బౌన్స్ చెక్కులు అగ్రస్థానంలో ఉన్నాయని, మొత్తం 4518 కేసులు(14.9 శాతం) నమోదయ్యాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ హిస్ ఎక్సలెన్సీ నస్ర్ బిన్ ఖమీస్ అల్ సవాయ్ తెలిపారు. 2022లో పబ్లిక్ ప్రాసిక్యూషన్ డీల్ చేసిన కేసుల గణాంకాలను సమీక్షించే పబ్లిక్ ప్రాసిక్యూషన్ వార్షిక సదస్సులో ఆయన వెల్లడించారు. గత సంవత్సరంలో ప్రజా హక్కుల కోసం సేకరించిన మొత్తం OMR 12.418 మిలియన్లు అని, గత సంవత్సరం జారీ చేసిన మొత్తం తీర్పుల సంఖ్య 15,442కి చేరుకుందని.. వాటిలో 90.2% అమలు చేయబడ్డాయని ఎక్స్ లెన్సీ వివరించారు. విచారణ సెషన్ల మధ్య విరామాలను తగ్గించే యంత్రాంగాన్ని ఆమోదించడానికి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా ఉపయోగించుకోవడానికి ఒక ప్రణాళికపై పని చేస్తున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది.
2022లో 13 హత్యలు
2022లో జరిగిన హత్యల సంఖ్య 13కు చేరిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వార్షిక సదస్సులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డాక్టర్ అహ్మద్ బిన్ సయీద్ అల్ షుకైలీ వెల్లడించారు. 2021లో కూడా ఈ సంఖ్య 13గానే ఉందని తెలిపారు. హత్యలను అధ్యయనం చేయడానికి, వాటి కారణాలను తెలుసుకోవడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్ సమర్థ అధికారంతో సమన్వయంతో పనిచేస్తుందని అల్-షుకైలీ తెలిపారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!