ఖతార్ లో 100% పైగా పెరిగిన విమాన ప్రయాణీకుల సంఖ్య
- January 31, 2023
దోహా: 2022 సంవత్సరంలో ఖతార్ విమానయాన రంగం రికార్డు సృష్టించింది. గతేడాది 35 మిలియన్లకు పైగా విమాన ప్రయాణికులను నమోదు చేసినట్లు ఖతార్ పౌర విమానయాన అథారిటీ తెలిపింది. ఇది 2021తో పోలిస్తే 101.9% పెరుగుదలను నమోదు చేసింది.ఈ మేరకు 2022 సంవత్సరానికి సంబంధించిన ఎయిర్ ట్రాన్స్పోర్ట్ గణాంకాలను వెల్లడించింది. 2021లో హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 17,703,274 మంది ప్రయాణికులు రాగా, 2022లో 35,734,243 మంది ప్రయాణికులు ప్రయాణించారు. 2022 సంవత్సరంలో విమానాల సంఖ్య 28.2% పెరిగింది. 2021లో నమోదైన మొత్తం విమానాలు 169,909 కాగా 2022లో వీటి సంఖ్య 217,875 కి పెరిగింది.నవంబర్ 20 నుండి డిసెంబర్ 18, 2022 వరకు జరిగిన FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022కి ఖతార్ ఆతిథ్యం ఇవ్వడం వల్ల విమానాశ్రయంలో విమానాలు, ప్రయాణీకుల పరంగా గణనీయమైన పెరుగుదల నమోదు చేసుకుందని పౌర విమానయాన అథారిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









