ఖతార్ లో 100% పైగా పెరిగిన విమాన ప్రయాణీకుల సంఖ్య
- January 31, 2023దోహా: 2022 సంవత్సరంలో ఖతార్ విమానయాన రంగం రికార్డు సృష్టించింది. గతేడాది 35 మిలియన్లకు పైగా విమాన ప్రయాణికులను నమోదు చేసినట్లు ఖతార్ పౌర విమానయాన అథారిటీ తెలిపింది. ఇది 2021తో పోలిస్తే 101.9% పెరుగుదలను నమోదు చేసింది.ఈ మేరకు 2022 సంవత్సరానికి సంబంధించిన ఎయిర్ ట్రాన్స్పోర్ట్ గణాంకాలను వెల్లడించింది. 2021లో హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 17,703,274 మంది ప్రయాణికులు రాగా, 2022లో 35,734,243 మంది ప్రయాణికులు ప్రయాణించారు. 2022 సంవత్సరంలో విమానాల సంఖ్య 28.2% పెరిగింది. 2021లో నమోదైన మొత్తం విమానాలు 169,909 కాగా 2022లో వీటి సంఖ్య 217,875 కి పెరిగింది.నవంబర్ 20 నుండి డిసెంబర్ 18, 2022 వరకు జరిగిన FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022కి ఖతార్ ఆతిథ్యం ఇవ్వడం వల్ల విమానాశ్రయంలో విమానాలు, ప్రయాణీకుల పరంగా గణనీయమైన పెరుగుదల నమోదు చేసుకుందని పౌర విమానయాన అథారిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..