ఆర్థిక క్లెయిమ్ల కారణంగా రోగులను ఆపే హక్కు ఆరోగ్య సంస్థలకు లేదు
- February 01, 2023
రియాద్: ఆర్థిక క్లెయిమ్ల కారణంగా మరణించిన వారి మృతదేహాలు, రోగుల గుర్తింపు పత్రాలను నిలిపివేయవద్దని రియాద్లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ అఫైర్స్ హెచ్చరించింది. ప్రైవేట్ హెల్త్ ఇన్స్టిట్యూషన్ చట్టంలోని ఆర్టికల్ 30 దాని ఎగ్జిక్యూటివ్ రెగ్యులేషన్ ప్రకారం.. మృతదేహాలను అప్పగించడంతోపాటు రోగులను, నవజాత శిశువులను డిశ్చార్జ్ చేయాల్సిందే. హాస్పిటల్ బిల్లు చెల్లించని కారణంగా మరణించిన వారి మృతదేహాలను అప్పగించక పోవడం, నవజాత శిశువు లేదా రోగులను ఆసుపత్రి నుండి బయటకు వెళ్లనివ్వకుండా నిలిపివేయడానికి లేదా గుర్తింపు పత్రాలను నిలిపివేయడానికి ఆరోగ్య సంస్థలకు హక్కు లేదు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ పర్యవేక్షణ పర్యటనలను నిర్వహిస్తోందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి ఆరోగ్య సంస్థ తనిఖీ కమిటీలకు సూచించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ అఫైర్స్ తెలిపింది. అలాంటి ఉల్లంఘనలపై 937కి కాల్ చేయడం ద్వారా రిపోర్ట్ చేయాల్సిందిగా కోరింది.
తాజా వార్తలు
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







