జెడ్డాలో ప్రారంభమైన సౌదీ తొలి ఎలక్ట్రిక్ బస్సు
- February 03, 2023
జెడ్డా: సౌదీ అరేబియాలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సు జెద్దాలో ప్రారంభమైంది. జెడ్డా గవర్నరేట్ మేయర్ సలేహ్ అల్-టర్కీ, సౌదీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ (SAPTCO) ఇంజినీర్ ప్రెసిడెంట్ ఖలీద్ అల్-హోగైల్ సమక్షంలో జరిగిన కార్యక్రమంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (PTA) యాక్టింగ్ చైర్మన్ డాక్టర్ రుమైహ్ అల్-రుమైహ్ బస్సు సర్వీస్ను ప్రారంభించారు. ఎలక్ట్రిక్ బస్సులు ప్రిన్స్ సౌద్ అల్-ఫైసల్ స్ట్రీట్ మీదుగా ఖలీదియాను బలాద్తో కలిపే A7 మార్గంలో మదీనా రోడ్ గుండా వెళతాయి. ఖలీదియా, రౌదా, అండలస్, రువైస్, బగ్దాదియా పరిసర ప్రాంతాలలోని ప్రయాణికులు ఈ సేవల నుండి ప్రయోజనం పొందవచ్చు. వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలను 25 శాతం తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు, లాజిస్టిక్స్ సేవలతో పాటు హైడ్రోజన్, క్లీన్ ఫ్యూయల్ వంటి ఇంధన రకాలతో సహా రవాణా రంగంలో సౌదీ అరేబియా అద్భుతమైన అభివృద్ధిని సాధించిందని డాక్టర్ అల్-రుమైహ్ తెలిపారు. 2030 నాటికి కర్బన ఉద్గారాలను 25 శాతం తగ్గించే లక్ష్యంతో రవాణా, లాజిస్టిక్స్ సేవల జాతీయ వ్యూహం లక్ష్యాల పరిధిలోకి ఎలక్ట్రిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సు సర్వీసును ప్రారంభించనున్నట్లు PTA ఒక ప్రకటనలో తెలిపింది. ఈ బస్సు ఒక్కసారి ఛార్జింగ్తో 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని, ఇతర ఎలక్ట్రిక్ బస్సులతో పోలిస్తే 10 శాతం కంటే తక్కువ విద్యుత్ వినియోగిస్తూ అధిక సామర్థ్యంతో సేవలు అందిస్తుందని అధికార యంత్రాంగం పేర్కొంది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







