ఇ-సిగరెట్లు సురక్షితం కాదు.. హెచ్ఎంసీ హెచ్చరిక
- February 05, 2023
దోహా: ఇ-సిగరెట్లు, ఇ-హుక్కా వంటి ఎలక్ట్రానిక్ ధూమపానానికి వ్యతిరేకంగా హమద్ మెడికల్ కార్పొరేషన్ (హెచ్ఎంసి) పొగాకు నియంత్రణ కేంద్రం హెచ్చరించింది. ఎలక్ట్రానిక్ సిగరెట్ తాగడం వల్ల వెలువడే పొగలో వినియోగదారులకు హాని కలిగించే విషపూరిత రసాయన పదార్థాలు ఉన్నాయని వ్యాధుల నియంత్రణ సీనియర్ కన్సల్టెంట్, HMC పొగాకు నియంత్రణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ అహ్మద్ అల్ ముల్లా తెలిపారు. ఎలక్ట్రానిక్ సిగరెట్ ధూమపానం అనేది ధూమపానం మానేయడానికి ప్రత్యామ్నాయ మార్గం కాదన్నారు. దీనికి శాస్త్రీయత లేదని ఆయన తెలిపారు. HMCలోని పొగాకు నియంత్రణ కేంద్రం నిర్వహించిన అధ్యయనాల ప్రకారం.. ఖతార్లో పొగాకు వినియోగదారులలో ఎలక్ట్రానిక్ సిగరెట్ వినియోగం దాదాపు 11 శాతం ఉందని డాక్టర్ అల్ ముల్లా వెల్లడించారు. ఎలక్ట్రానిక్ సిగరెట్ తాగేవారు నోటిలో ఇన్ఫెక్షన్లు, చిగుళ్ళు, దంతాలు, శ్వాసనాళాలు దెబ్బతినడం, గుండె - ఛాతీలో నొప్పులు వంటి అనేక సమస్యల వస్తాయని పొగాకు విరమణ నిపుణుడు డాక్టర్ జమాల్ బా సుహై హెచ్చరించారు. ధూమపానం మానేయాలనుకునే వ్యక్తులు HMC పొగాకు నియంత్రణ కేంద్రంలో సహాయం పొందాలని, సురక్షితమని నిరూపించబడిన మందులను స్వీకరించాలని అలాగే అధిక శిక్షణ పొందిన బృందం నుండి సలహాలు, మద్దతును పొందాలని డాక్టర్ జమాల్ బా సుహై సూచించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
- యూఏఈలో త్వరలో స్టార్లింక్.. ముందస్తు బుకింగ్ ఎలాగంటే?
- ఖతార్లో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం 2026..!!
- బహ్రెయిన్లోని రిఫాలో ట్రాఫిక్ రద్దీకి చెక్..!!
- గల్ఫ్ పౌరుడి హత్య కేసులో బంగ్లాదేశీయుడు అరెస్ట్..!!
- సౌదీలో ఉరుములు.. భారీ వర్షాలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియంలో అరుదైన ఘనత..!!
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు







