ఇ-సిగరెట్లు సురక్షితం కాదు.. హెచ్ఎంసీ హెచ్చరిక
- February 05, 2023
దోహా: ఇ-సిగరెట్లు, ఇ-హుక్కా వంటి ఎలక్ట్రానిక్ ధూమపానానికి వ్యతిరేకంగా హమద్ మెడికల్ కార్పొరేషన్ (హెచ్ఎంసి) పొగాకు నియంత్రణ కేంద్రం హెచ్చరించింది. ఎలక్ట్రానిక్ సిగరెట్ తాగడం వల్ల వెలువడే పొగలో వినియోగదారులకు హాని కలిగించే విషపూరిత రసాయన పదార్థాలు ఉన్నాయని వ్యాధుల నియంత్రణ సీనియర్ కన్సల్టెంట్, HMC పొగాకు నియంత్రణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ అహ్మద్ అల్ ముల్లా తెలిపారు. ఎలక్ట్రానిక్ సిగరెట్ ధూమపానం అనేది ధూమపానం మానేయడానికి ప్రత్యామ్నాయ మార్గం కాదన్నారు. దీనికి శాస్త్రీయత లేదని ఆయన తెలిపారు. HMCలోని పొగాకు నియంత్రణ కేంద్రం నిర్వహించిన అధ్యయనాల ప్రకారం.. ఖతార్లో పొగాకు వినియోగదారులలో ఎలక్ట్రానిక్ సిగరెట్ వినియోగం దాదాపు 11 శాతం ఉందని డాక్టర్ అల్ ముల్లా వెల్లడించారు. ఎలక్ట్రానిక్ సిగరెట్ తాగేవారు నోటిలో ఇన్ఫెక్షన్లు, చిగుళ్ళు, దంతాలు, శ్వాసనాళాలు దెబ్బతినడం, గుండె - ఛాతీలో నొప్పులు వంటి అనేక సమస్యల వస్తాయని పొగాకు విరమణ నిపుణుడు డాక్టర్ జమాల్ బా సుహై హెచ్చరించారు. ధూమపానం మానేయాలనుకునే వ్యక్తులు HMC పొగాకు నియంత్రణ కేంద్రంలో సహాయం పొందాలని, సురక్షితమని నిరూపించబడిన మందులను స్వీకరించాలని అలాగే అధిక శిక్షణ పొందిన బృందం నుండి సలహాలు, మద్దతును పొందాలని డాక్టర్ జమాల్ బా సుహై సూచించారు.
తాజా వార్తలు
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- ఇరాన్లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..
- చమురు నిల్వలకు నెలవైన ఖర్గ్ ద్వీపం పై అమెరికా దాడులు
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!









