ప్రైవేట్ కంపెనీలలో ఎమిరటైజేషన్: నిబంధనలను సవరించిన యూఏఈ
- February 07, 2023
యూఏఈ: దేశంలోని ప్రైవేట్ రంగంలో ఎమిరేటైజేషన్ పథకంలోని కొన్ని నిబంధనలను సవరిస్తూ యూఏఈ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. వార్షిక లక్ష్యాన్ని రెండు విభాగాలుగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి ఆరు నెలల్లో 1 శాతం, రెండవ ఆరు నెలల్లో మిగిలిన 1 శాతాన్ని పూర్తి చేయాలి. ఫెడరల్ చట్టం 2026 చివరి నాటికి 10 శాతానికి చేరుకోవడానికి ఏటా 2 శాతం ఎమిరేటైజేషన్ రేట్లను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2022 చివరి నాటికి కంపెనీలు 2 శాతం ఎమిరాటీలను నైపుణ్యం కలిగిన ఉద్యోగాల్లో నియమించాలి. UAE మానవ వనరులు, ఎమిరటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) 2022లో ఎమిరేటైజేషన్ లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైన ప్రైవేట్ కంపెనీలకు 400 మిలియన్ దిర్హామ్ల జరిమానాను విధించింది. 2022 సంవత్సరంలో దాదాపు 9,293 కంపెనీలు ఎమిరటైజేషన్ లక్ష్యాలను సాధించాయి. 50,000 కంటే ఎక్కువ మంది ఎమిరాటీలు ఇప్పుడు ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నారు, 'నఫీస్' కార్యక్రమం ప్రారంభించినప్పటి నుండి 28,700 మంది ఎమిరాటీలు కొత్తగా ఉద్యోగాల్లో చేరారు. ప్రస్తుతం ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఎమిరాటీల సంఖ్య 70 శాతానికి పెరిగిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!









