ప్రైవేట్ కంపెనీలలో ఎమిరటైజేషన్: నిబంధనలను సవరించిన యూఏఈ
- February 07, 2023
యూఏఈ: దేశంలోని ప్రైవేట్ రంగంలో ఎమిరేటైజేషన్ పథకంలోని కొన్ని నిబంధనలను సవరిస్తూ యూఏఈ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. వార్షిక లక్ష్యాన్ని రెండు విభాగాలుగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి ఆరు నెలల్లో 1 శాతం, రెండవ ఆరు నెలల్లో మిగిలిన 1 శాతాన్ని పూర్తి చేయాలి. ఫెడరల్ చట్టం 2026 చివరి నాటికి 10 శాతానికి చేరుకోవడానికి ఏటా 2 శాతం ఎమిరేటైజేషన్ రేట్లను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2022 చివరి నాటికి కంపెనీలు 2 శాతం ఎమిరాటీలను నైపుణ్యం కలిగిన ఉద్యోగాల్లో నియమించాలి. UAE మానవ వనరులు, ఎమిరటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) 2022లో ఎమిరేటైజేషన్ లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైన ప్రైవేట్ కంపెనీలకు 400 మిలియన్ దిర్హామ్ల జరిమానాను విధించింది. 2022 సంవత్సరంలో దాదాపు 9,293 కంపెనీలు ఎమిరటైజేషన్ లక్ష్యాలను సాధించాయి. 50,000 కంటే ఎక్కువ మంది ఎమిరాటీలు ఇప్పుడు ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నారు, 'నఫీస్' కార్యక్రమం ప్రారంభించినప్పటి నుండి 28,700 మంది ఎమిరాటీలు కొత్తగా ఉద్యోగాల్లో చేరారు. ప్రస్తుతం ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఎమిరాటీల సంఖ్య 70 శాతానికి పెరిగిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







