ప్రైవేట్ కంపెనీలలో ఎమిరటైజేషన్: నిబంధనలను సవరించిన యూఏఈ
- February 07, 2023
యూఏఈ: దేశంలోని ప్రైవేట్ రంగంలో ఎమిరేటైజేషన్ పథకంలోని కొన్ని నిబంధనలను సవరిస్తూ యూఏఈ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. వార్షిక లక్ష్యాన్ని రెండు విభాగాలుగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి ఆరు నెలల్లో 1 శాతం, రెండవ ఆరు నెలల్లో మిగిలిన 1 శాతాన్ని పూర్తి చేయాలి. ఫెడరల్ చట్టం 2026 చివరి నాటికి 10 శాతానికి చేరుకోవడానికి ఏటా 2 శాతం ఎమిరేటైజేషన్ రేట్లను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2022 చివరి నాటికి కంపెనీలు 2 శాతం ఎమిరాటీలను నైపుణ్యం కలిగిన ఉద్యోగాల్లో నియమించాలి. UAE మానవ వనరులు, ఎమిరటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) 2022లో ఎమిరేటైజేషన్ లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైన ప్రైవేట్ కంపెనీలకు 400 మిలియన్ దిర్హామ్ల జరిమానాను విధించింది. 2022 సంవత్సరంలో దాదాపు 9,293 కంపెనీలు ఎమిరటైజేషన్ లక్ష్యాలను సాధించాయి. 50,000 కంటే ఎక్కువ మంది ఎమిరాటీలు ఇప్పుడు ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నారు, 'నఫీస్' కార్యక్రమం ప్రారంభించినప్పటి నుండి 28,700 మంది ఎమిరాటీలు కొత్తగా ఉద్యోగాల్లో చేరారు. ప్రస్తుతం ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఎమిరాటీల సంఖ్య 70 శాతానికి పెరిగిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!







