వందలాది ఉద్యోగుల్ని తొలగిస్తున్న EBay..
- February 08, 2023
ప్రముఖ ఈకామర్స్ కంపెనీఈబే 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా మహమ్మారి సమయంలో కూడా ఏదో విధంగా నెట్టుకొచ్చిన కంపెనీలు ఆ ప్రభావం తాజాగా పడటానికి తోడు ఆర్థిక సంక్షోభం వెరసి ఉద్యోగుల కోత విధిస్తున్నాయి పలు కంపెనీలు. కరోనా మహమ్మారి తర్వాత అమ్మకాలు తగ్గడంతో 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నామని ఈబే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జామీ ఇయానోన్ మంగళవారం (ఫిబ్రవరి 7,2023) ప్రకటించారు. 4 శాతం ఉద్యోగులను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఈబే కంపెనీ సీఈఓ జామీ ఇయానోస్ తెలిపారు.
1995లో అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థాపించబడిన ఈబే ఈకామర్స్ అమ్మకాలు, కొనుగోలు ప్లాట్ ఫామ్ గా ఉంది. ఎలక్ట్రానిక్స్,ఫ్యాషన్ ప్రొడక్ట్స్ నుంచి గిఫ్టు ఆర్టికల్స్ తో పాటు అనేక రకాల ఉత్పత్తులు ఈబేలో విక్రయానికి అందుబాటులో ఉంటాయి.
డెల్ కంపెనీ,జూమ్ కంపెనీ కూడా ఉద్యోగుల కోత విధించాయి. జూమ్ 1300ల మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రటించింది. అలాగే డెల్ 6,600 ఉద్యోగాలను తగ్గించింది. అమ్మకాలు క్షీణించి ఆదాయం తగ్గడంతో ఉద్యోగుల తొలగింపు తప్పలేదని కంపెనీ వివరించింది. అలాగే ఈకామర్స్ కంపెనీ అమెజాన్ ఏకంగా 18వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఇలా ఈ కంపెనీ ఈ కంపెనీ అనిలేదు ఉద్యోగుల కోత ప్రకటనల్ని మోతెక్కిస్తున్నాయి. ఆయా కంపెనీల ప్రకటనలతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









