వందలాది ఉద్యోగుల్ని తొలగిస్తున్న EBay..
- February 08, 2023
ప్రముఖ ఈకామర్స్ కంపెనీఈబే 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా మహమ్మారి సమయంలో కూడా ఏదో విధంగా నెట్టుకొచ్చిన కంపెనీలు ఆ ప్రభావం తాజాగా పడటానికి తోడు ఆర్థిక సంక్షోభం వెరసి ఉద్యోగుల కోత విధిస్తున్నాయి పలు కంపెనీలు. కరోనా మహమ్మారి తర్వాత అమ్మకాలు తగ్గడంతో 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నామని ఈబే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జామీ ఇయానోన్ మంగళవారం (ఫిబ్రవరి 7,2023) ప్రకటించారు. 4 శాతం ఉద్యోగులను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఈబే కంపెనీ సీఈఓ జామీ ఇయానోస్ తెలిపారు.
1995లో అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థాపించబడిన ఈబే ఈకామర్స్ అమ్మకాలు, కొనుగోలు ప్లాట్ ఫామ్ గా ఉంది. ఎలక్ట్రానిక్స్,ఫ్యాషన్ ప్రొడక్ట్స్ నుంచి గిఫ్టు ఆర్టికల్స్ తో పాటు అనేక రకాల ఉత్పత్తులు ఈబేలో విక్రయానికి అందుబాటులో ఉంటాయి.
డెల్ కంపెనీ,జూమ్ కంపెనీ కూడా ఉద్యోగుల కోత విధించాయి. జూమ్ 1300ల మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రటించింది. అలాగే డెల్ 6,600 ఉద్యోగాలను తగ్గించింది. అమ్మకాలు క్షీణించి ఆదాయం తగ్గడంతో ఉద్యోగుల తొలగింపు తప్పలేదని కంపెనీ వివరించింది. అలాగే ఈకామర్స్ కంపెనీ అమెజాన్ ఏకంగా 18వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఇలా ఈ కంపెనీ ఈ కంపెనీ అనిలేదు ఉద్యోగుల కోత ప్రకటనల్ని మోతెక్కిస్తున్నాయి. ఆయా కంపెనీల ప్రకటనలతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







