సముద్ర చేపలు.! కిడ్నీ రోగులకు దివ్యౌషధం.!

- February 08, 2023 , by Maagulf
సముద్ర చేపలు.! కిడ్నీ రోగులకు దివ్యౌషధం.!

ఆకుకూరల్లో ఎక్కువగా లభించే ఒమేగా 3 ఫాటీ ఆమ్లాలు.. సముద్ర చేపల్లోనూ అధికంగా వున్నట్లు గుర్తించారు. అందుకే సముద్ర చేపలను రెగ్యులర్‌గా తినడం వల్ల మూత్ర పిండాలూ, కిడ్నీ సంబంధిత వ్యాధులకు మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. 
సముద్రంలో దొరికే ఏ జాతికి చెందిన చేపలైనా ఆహారంలో భాగం చేసుకోవడం మంచిదట. అప్పుడప్పుడూ సముద్ర చేపలను తినేవారిలోనే అధికంగా దీర్ఘ కాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతున్నట్లు అధ్యయనాలు వెల్లడించాయ్. 
అలాంటిది కనీసం వారానికోసారైనా తినే వారిలో కిడ్నీ సంబంధిత వ్యాధుల నుంచి రిస్క్ చాలా చాలా తక్కువగా వుంటోందనీ ఓ సర్వే ద్వారా తేలింది. 
కవ్వలు, కానాగంగతలు, మాగ, పొలస తదితర సముద్ర చేపలతో అధికంగా ఆరోగ్య ప్రయోజనాలున్నట్లు తాజా అధ్యయనాల్లో తేలింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com