యూఏఈ టూర్ ఉమెన్ 2023 సైక్లింగ్ ఈవెంట్: కీలక రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు
- February 09, 2023
దుబాయ్: ఫిబ్రవరి 9న ప్రారంభమయ్యే యూఏఈ టూర్ ఉమెన్ 2023 సైక్లింగ్ ఈవెంట్ కోసం ఎమిరేట్లోని పలు రహదారులను మూసివేస్తున్నట్లు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు పలు కీలక రహదారులలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు RTA ట్విట్టర్లో పేర్కొంది. వాహనదారులు తమ ప్రయాణాన్ని తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని కోరారు.
రేసు యొక్క 1వ దశ దుబాయ్లో ఫ్లాగ్ ఆఫ్ చేయబడుతుందని, పోర్ట్ రషీద్ నుండి ప్రారంభమై నగరం దాటుతుందని తెలిపింది. యూఏఈ టూర్ క్లాసిక్ స్థానాలైన రస్ అల్ ఖోర్, మైదాన్ రేస్కోర్స్, ఉమ్ సుఖీమ్, దుబాయ్ స్పోర్ట్స్ సిటీల ద్వారా పామ్ జుమేరా బేస్, దుబాయ్ హార్బర్కు చేరుకుంటుంది. రేసు సమయంలో సైక్లిస్టులు ప్రయాణిస్తున్నప్పుడు నిర్దిష్ట ట్రాఫిక్ జంక్షన్ల వద్ద 10-15 నిమిషాల పాటు ట్రాఫిక్ను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ఆర్టీఏ తెలిపింది. ఈ ఆంక్షలు ఫిబ్రవరి 9 నుండి 12 వరకు అమల్లో ఉంటుందన్నారు.
యూఏఈ జట్టు ADQ
సఫియా అల్సాయెగ్ (యుఎఇ), అలెనా అమియాలియుసిక్ (బెలారస్), ఒలివియా బారిల్ (కెనడా), మార్తా బాస్టియానెల్లి (ఇటలీ), సోఫియా బెర్టిజోలో (ఇటలీ), యూజీనియా బుజాక్ (స్లోవేనియా), చియారా కాన్సోని (ఇటలీ), ఎలియోనోరా గాస్పర్రిని (ఇటలీ), (న్యూజిలాండ్), ఎలిజబెత్ హోల్డెన్ (గ్రేట్ బ్రిటన్), అలెనా ఇవాంచెంకో (రష్యా), కరోలినా కుమీగా (పోలాండ్), ఎరికా మాగ్నాల్డి (ఇటలీ), సిల్వియా పెర్సికో (ఇటలీ), లారా తోమాసి (ఇటలీ), అన్నా ట్రెవిసి (ఇటలీ).
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







