ఈ-వీసా, వీసా ఆన్ అరైవల్ అందించే దేశాలకే పర్యాటకుల మొగ్గు!
- February 09, 2023
యూఏఈ: యూఏఈ నివాసితులు ఇ-వీసా, వీసా ఆన్ అరైవల్ అందించే దేశాలకు వెళ్లడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అజర్బైజాన్, మాల్దీవులు, జార్జియా, అర్మేనియా ఇతర అనేక దేశాలు యూఏఈ నివాసితులు, జాతీయులకు వీసా-ఆన్-అరైవల్ లేదా ఇ-వీసా సేవలను అందిస్తున్నాయని VFS గ్లోబల్ సీనియర్ అధికారి తెలిపారు. కోవిడ్-19 తర్వాత యూఏఈ నుండి అవుట్బౌండ్ ట్రావెల్, టూరిజం విపరీతంగా అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం పర్యాటక రంగం మహమ్మారికి ముందు స్థాయికి చేరుకుందన్నారు. థాయిలాండ్, సురినామ్, ఇటీవల ఇండోనేషియా (ఇది సెప్టెంబర్ 2022లో ప్రారంభమైంది) వంటి ఇ-వీసా, వీసా-ఆన్-అరైవల్ సేవలను అందించే దేశాలకు డిమాండ్ పెరిగిందని VFS గ్లోబల్ మిడిల్ ఈస్ట్ హెడ్ ప్రణవ్ సిన్హా తెలిపారు.
కెనడా, యుకె, యూరప్ వంటి ప్రముఖ దేశాల్లో హాలిడే ప్యాకేజీలకు యూఏఈ నివాసితుల నుంచి డిమాండ్ ఉందని సిన్హా చెప్పారు. ప్రజలు ఈ-వీసా లేదా వీసా ఆన్ అరైవల్ అందించే దేశాలను సందర్శించడానికి ఇష్టపడుతున్నారని చెప్పారు. వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి క్యూలో గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదని, కాన్సులేట్లు, రాయబార కార్యాలయాల నుండి అనుమతి కోసం వేచి చూడాల్సిన అవసరం లేనందున పర్యాటకులు వీసా ఆన్ అరైవల్ అందించే దేశాలకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నరని ప్రణవ్ సిన్హా తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







