జెడ్డాలో రైల్వే ట్రాక్ వద్ద కారు ప్రమాదం.. పలువురికి గాయాలు
- February 09, 2023
జెడ్డా : జెడ్డాలోని హరమైన్ రైల్వే ట్రాక్ వెలుపల కారు ప్రమాదం జరిగింది. కారు వంతెనపై నుండి పడి మంటలు చెలరేగిన ఘటనలో అనేక మందికి గాయాలయ్యాయి. బుధవారం తెల్లవారుజామున 2.00 గంటలకు జెడ్డా గవర్నరేట్లోని ప్రిన్స్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ రోడ్ (తహ్లియా) కూడలి వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు హరమైన్ హై-స్పీడ్ రైలు ఒక ప్రకటనలో తెలిపింది. ఎటువంటి మరణాలు సంభవించలేదని, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపింది. ఈ ప్రమాదం రైళ్ల రాకపోకలపైనా, రైలు ప్రయాణాల షెడ్యూల్పైనా ప్రభావం చూపలేదని, మరమ్మతు పనులు ప్రారంభించినట్లు ప్రకటనలో అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







