జెడ్డాలో రైల్వే ట్రాక్ వద్ద కారు ప్రమాదం.. పలువురికి గాయాలు
- February 09, 2023
జెడ్డా : జెడ్డాలోని హరమైన్ రైల్వే ట్రాక్ వెలుపల కారు ప్రమాదం జరిగింది. కారు వంతెనపై నుండి పడి మంటలు చెలరేగిన ఘటనలో అనేక మందికి గాయాలయ్యాయి. బుధవారం తెల్లవారుజామున 2.00 గంటలకు జెడ్డా గవర్నరేట్లోని ప్రిన్స్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ రోడ్ (తహ్లియా) కూడలి వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు హరమైన్ హై-స్పీడ్ రైలు ఒక ప్రకటనలో తెలిపింది. ఎటువంటి మరణాలు సంభవించలేదని, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపింది. ఈ ప్రమాదం రైళ్ల రాకపోకలపైనా, రైలు ప్రయాణాల షెడ్యూల్పైనా ప్రభావం చూపలేదని, మరమ్మతు పనులు ప్రారంభించినట్లు ప్రకటనలో అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







