టర్కీ-సిరియాలో 11,300 దాటిన మృతుల సంఖ్య..ఇండియా ఆసుపత్రి ప్రారంభం
- February 09, 2023
కువైట్: టర్కీ, సిరియాలో మృత్యుఘోష కొనసాగుతూనే ఉంది. భూకంపంలో మరణించిన వారి సంఖ్య 11,376 దాటింది. టర్కీలో కనీసం 8,574 మంది మరణించారని, దాదాపు 50,000 మంది గాయపడ్డారని, 6,444 భవనాలు కూలిపోయాయని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తెలిపారు. సోమవారం నాటి భూకంప కేంద్రానికి సమీపంలోని విపత్తు ప్రాంతాలను సందర్శించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు సిరియాలో మొత్తం మరణాల సంఖ్య 2802కి చేరుకుంది. వాయువ్య ప్రాంతంలో తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో 1,540 మరణాలు నమోదయ్యాయని సీఎన్ఎన్ వెల్లడించింది.
కాగా, భూకంపంతో అతలాకుతలమైన టర్కీ ప్రజలకు సాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ తెలిపారు. ఆపరేషన్ ‘దోస్త్’లో భాగంగా టర్కీలో నాలుగు బృందాలు పని చేస్తున్నాయని, ఇందులో రెండు రెస్క్యూ టీమ్లు, డాగ్ స్క్వాడ్లు, రెండు వైద్య బృందాలు ఉన్నాయని చెప్పారు. భారత్ ఇప్పటికే టర్కీలో ఫీల్డ్ హాస్పిటల్ను ప్రారంభించిందని ఆయన చెప్పారు.భారతదేశం ఇప్పటికే నాలుగు బృందాలను NDRF రెండు రెస్క్యూ బృందాలు, వైద్య సహాయం కోసం రెండు బృందాలను పంపిందన్నారు. నేడు NDRF మూడవ బృందం డాగ్ స్క్వాడ్, మందులు, దుప్పట్లు, నాలుగు చక్రాల వాహనాలతో పాటు టర్కీకి బయలుదేరుతోందని మురళీధరన్ ఏఎన్ఐతో చెప్పారు.
తాజా వార్తలు
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!







