సిరియా, టర్కీలకు dhs50 మిలియన్లు ప్రటించిన షేఖా ఫాతిమా
- February 10, 2023
యూఏఈ: భూకంప ధాటికి తీవ్రంగా నష్టపోయిన టర్కీ, సిరియాలకు హర్ హైనెస్ షేఖా ఫాతిమా బింట్ ముబారక్, జనరల్ ఉమెన్స్ యూనియన్ (GWU), సుప్రీం కౌన్సిల్ ఫర్ మదర్హుడ్ అండ్ చైల్డ్హుడ్ చైర్వుమన్, ఫ్యామిలీ డెవలప్మెంట్ ఫౌండేషన్ సుప్రీం చైర్వుమన్, ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్ (ERC) గౌరవ అధ్యక్షురాలు షేఖా ఆపన్న హస్తం అందజేశారు. సిరియా, టర్కీలో భూకంప బాధిత ప్రజల కోసం కొనసాగుతున్న మానవతా, సహాయక చర్యలకు మద్దతుగా ERC ప్రారంభించిన బ్రిడ్జ్ ఆఫ్ గుడ్నెస్ ప్రచారానికి మద్దతుగా శరణార్థి మహిళల కోసం ఫాతిమా ఫండ్ 50 మిలియన్ దిర్హామ్ లను అందించనున్నట్లు ప్రకటించారు. వేలాది మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేసిన భూకంపాల పరిణామాలను తగ్గించడానికి యూఏఈ నాయకత్వ చేపట్టిన కార్యక్రమాలకు తమ మద్దతు కొనసాగుతుందని షేఖా ఫాతిమా పేర్కొన్నారు. విపత్తుల సమయంలో యూఏఈ మానవతా చొరవ బాధితులకు కొంతైనా సాంత్వన కలిగిస్తుందన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







