ఒమన్ లో బలమైన భూకంప పర్యవేక్షణ గ్రిడ్ ఏర్పాటు
- February 10, 2023
మస్కట్: భూకంపాలను పర్యవేక్షించడానికి 21 స్టేషన్లు సరికొత్త పరికరాలతో సిద్ధంగా ఉన్నాయని SQUలోని భూకంపాల పర్యవేక్షణ కేంద్రం (EMC) డైరెక్టర్ డాక్టర్ ఇస్సా అల్ హుస్సేన్ తెలిపారు. అత్యాధునికి భూకంప కేంద్రాలు భూకంప కేంద్రంతోపాటు వాటి ప్రభావాన్ని గుర్తించడంలో సహాయపడతాయని చెప్పారు. ఒమన్ సుల్తానేట్ అరేబియా, యురేషియన్ ప్లేట్ల మధ్య కన్వర్జెన్స్ జోన్లో ఉన్న అరేబియన్ ప్లేట్ లో ఉందని, ఇక్కడ భూకంప కార్యకలాపాలు ప్రతిసారీ డైనమిక్ కదలికలో వెళ్తాయన్నారు. రాబోయే నెలల్లో నగరాలు, పట్టణ ప్రాంతాలలో వ్యాప్తి చెందే బలమైన నెట్వర్క్ కోసం తాము మానిటరింగ్ స్టేషన్ను ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉన్నామని అతను తెలిపారు. కొత్త దేశవ్యాప్త నెట్వర్క్ ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ట్రెమోలోస్ మాగ్నిట్యూడ్ల వైవిధ్యంపై మెరుగైన సమాచారాన్ని ఇస్తుందని అన్నారు. అరేబియా ప్లేట్ తూర్పు భాగంలో జాగ్రోజ్ ఫోల్డ్, ఒమన్ సముద్రం లేదా అరేబియా సముద్రంలో ఇప్పటివరకు భూకంప కార్యకలాపాలను గమనించలేదని అల్ హుస్సేన్ ధృవీకరించారు.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!
- రీసైకిల్ పదార్థాలతో క్రెడిట్ కార్డుల తయారీ..!!
- అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం







