ప్రవక్త మస్జీదు ప్రాంగణంలోకి ప్రవేశించిన ఇద్దరు ముస్లిమేతర మహిళలు
- February 10, 2023
మదీనా : ప్రవక్త మస్జీదు ప్రాంగణంలోకి ఇద్దరు ముస్లిమేతర మహిళలు ప్రవేశించారని, ఇది పొరపాటున జరిగిందని మదీనాలోని ప్రవక్త మస్జీదు వ్యవహారాల ఏజెన్సీ ప్రకటించింది., ఫిబ్రవరి 7న(మంగళవారం) జరిగిన ఈ సంఘటన గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేయబడిన దానికి ప్రతిస్పందనగా ఏజెన్సీ వివరణ వచ్చింది. ‘‘ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మస్జీదు ప్రత్యేకత, పవిత్రత గురించి మహిళలకు వివరించిన తర్వాత వారు జ్ఞానోదయం పొందారు. ప్రెసిడెన్సీ సిబ్బంది వారికి ఇచ్చిన సూచనలు వారు అర్థం చేసుకోవడంలో పొరబాటు జరిగింది. తమకు అవగాహన కల్పించిన ప్రెసిడెన్సీ సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు.” అని ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ సంఘటన తెలియజేసిందన్నారు. అలాగే పవిత్ర స్థలం పవిత్రత, ప్రత్యేకతపై అవగాహన, మార్గదర్శకత్వం, విధానాలను మరింత మెరుగుపరచాల్సిన అవసరాన్ని కూడా తెలియజేసిందని ప్రవక్త మస్జీదు వ్యవహారాల ఏజెన్సీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!









