ప్రవక్త మస్జీదు ప్రాంగణంలోకి ప్రవేశించిన ఇద్దరు ముస్లిమేతర మహిళలు
- February 10, 2023
మదీనా : ప్రవక్త మస్జీదు ప్రాంగణంలోకి ఇద్దరు ముస్లిమేతర మహిళలు ప్రవేశించారని, ఇది పొరపాటున జరిగిందని మదీనాలోని ప్రవక్త మస్జీదు వ్యవహారాల ఏజెన్సీ ప్రకటించింది., ఫిబ్రవరి 7న(మంగళవారం) జరిగిన ఈ సంఘటన గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేయబడిన దానికి ప్రతిస్పందనగా ఏజెన్సీ వివరణ వచ్చింది. ‘‘ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మస్జీదు ప్రత్యేకత, పవిత్రత గురించి మహిళలకు వివరించిన తర్వాత వారు జ్ఞానోదయం పొందారు. ప్రెసిడెన్సీ సిబ్బంది వారికి ఇచ్చిన సూచనలు వారు అర్థం చేసుకోవడంలో పొరబాటు జరిగింది. తమకు అవగాహన కల్పించిన ప్రెసిడెన్సీ సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు.” అని ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ సంఘటన తెలియజేసిందన్నారు. అలాగే పవిత్ర స్థలం పవిత్రత, ప్రత్యేకతపై అవగాహన, మార్గదర్శకత్వం, విధానాలను మరింత మెరుగుపరచాల్సిన అవసరాన్ని కూడా తెలియజేసిందని ప్రవక్త మస్జీదు వ్యవహారాల ఏజెన్సీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







