65,800 కేసులు నమోదు.. అల్-అసిమా గవర్నరేట్ లో అత్యధికం
- February 10, 2023
కువైట్: కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సాధారణ పరిశోధనల విభాగం 2022లో 65,897 దర్యాప్తు కేసులను నమోదు చేసింది. ఈ మేరకు బుధవారం డిపార్ట్మెంట్ వార్షిక గణాంకాలను విడుదల చేసింది. 2022లో నమోదైన మొత్తం కేసుల్లో 53,485 నేరాలకు సపంబంధించినవి ఉండగా.. 12,412 ట్రాఫిక్ ఉల్లంఘనలు ఉన్నాయి. అల్-అసిమా గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ 3,705 నేరాలు, 3,374 ట్రాఫిక్ ఉల్లంఘనలను నమోదు చేసింది. మొత్తం 7,079 కేసులు ఈ గవర్నరేట్ లో నమోదయ్యాయి.
ఇక హవల్లీ గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తం 7,040 నమోదైన కేసులలో 4,338 నేరాలు, 2,702 ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు ఉన్నాయి. ముబారక్ అల్-కబీర్ గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ 1,592 నేరాలు, 1,305 ట్రాఫిక్ ఉల్లంఘనలను(మొత్తం 2,897 కేసులు) నమోదు చేసింది. అల్-అహ్మదీ గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (మొత్తం 5,499 కేసులు) 3,549 నేరాలు, 1,950 ట్రాఫిక్ ఉల్లంఘనలను నమోదు చేసింది. అల్ఫర్వానియా గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ 3,730 నేరాలు, 1,696 ట్రాఫిక్ ఉల్లంఘనలను (మొత్తం 5,426 కేసులు)నమోదు చేసింది. అల్-జహ్రా గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ 3,171 నేరాలు, 1,385 ట్రాఫిక్ ఉల్లంఘనలను(మొత్తం 4,556 కేసులు) నమోదు చేసింది. ప్రత్యేక నేరాల దర్యాప్తు విభాగం మొత్తం 33,400 నేరాలను నమోదు చేసిందని వార్షిక గణాంకాలలో తెలిపారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







