కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగ నియామక పరీక్ష తేదీల్లో మార్పు..
- February 10, 2023
న్యూ ఢిల్లీ: భారత దేశ వ్యాప్తంగా పలు కేంద్రీయ విద్యాలయాల్లో 13,404 టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి కేంద్రీయ విద్యాలయ సంగతన్ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఈ పోస్టులకు ఫిబ్రవరి 7నుంచి ప్రారంభమైన ఆన్లైన్ రాత పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకోనున్నట్లు కేవీఎస్ తాజాగా ప్రకటన విడుదల చేసింది. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పరీక్ష తేదీలను సవరించినట్టు తన ప్రకటనలో తెల్పింది.
సవరించిన తేదీలు, షిఫ్టుల వివరాలను తెల్పుతూ కొత్త షెడ్యూల్ను విడుదల చేసింది. ఇప్పటివరకు అసిస్టెంట్ కమిషనర్ పేపర్ 1; పేపర్ 2లతో పాటు ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పీఆర్టీ మ్యూజిక్ పోస్టులకు సంబంధించిన పరీక్షలు పూర్తయ్యాయి. మిగిలిన పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను కేవీ సంఘటన్ అధికారిక వెబ్సైట్లో పొందుపరచింది.
తాజా వార్తలు
- కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం..ఏపీలో త్వరలో మరో కొత్త పథకం..!
- తెలంగాణ కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!









