కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగ నియామక పరీక్ష తేదీల్లో మార్పు..
- February 10, 2023![1 కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగ నియామక పరీక్ష తేదీల్లో మార్పు..](https://www.maagulf.com/godata/articles/202302/kvs_1676022210.jpg)
న్యూ ఢిల్లీ: భారత దేశ వ్యాప్తంగా పలు కేంద్రీయ విద్యాలయాల్లో 13,404 టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి కేంద్రీయ విద్యాలయ సంగతన్ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఈ పోస్టులకు ఫిబ్రవరి 7నుంచి ప్రారంభమైన ఆన్లైన్ రాత పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకోనున్నట్లు కేవీఎస్ తాజాగా ప్రకటన విడుదల చేసింది. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పరీక్ష తేదీలను సవరించినట్టు తన ప్రకటనలో తెల్పింది.
సవరించిన తేదీలు, షిఫ్టుల వివరాలను తెల్పుతూ కొత్త షెడ్యూల్ను విడుదల చేసింది. ఇప్పటివరకు అసిస్టెంట్ కమిషనర్ పేపర్ 1; పేపర్ 2లతో పాటు ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పీఆర్టీ మ్యూజిక్ పోస్టులకు సంబంధించిన పరీక్షలు పూర్తయ్యాయి. మిగిలిన పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను కేవీ సంఘటన్ అధికారిక వెబ్సైట్లో పొందుపరచింది.
తాజా వార్తలు
- అత్యున్నత ప్రపంచ ప్రమాణాలతో ఖతార్ ఏవియేషన్ రంగం..!
- పారిస్ ఒలింపిక్స్ 2024: అట్టహాసంగా ఆరంభ వేడుకలు..
- ఒమన్లో ధూళి తుఫానులు..అలెర్ట్ జారీ
- నవజాత శిశువుల స్క్రీనింగ్.. యూఏఈలో కొత్త మార్గదర్శకాలు
- 'మాస్టర్ ఆఫ్ డవలప్ మెంట్ ఎక్సలెన్స్ అవార్డు-2024'ను సొంతం చేసుకున్న అన్వితా గ్రూప్
- రేపటి భారత క్రీడా షెడ్యూల్ ఇదే..
- మద్యం కుంభకోణంలో జగన్ ను వదిలేది లేదు: మంత్రి కొల్లు రవీంద్ర
- షిర్డీ సాయినాధుని సేవలో ఏపీ గవర్నర్
- ఆసియా కప్: పాక్ పై విజయం…ఫైనల్స్ కు శ్రీలంక
- ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్త