హైదరాబాద్ పై థమన్ కొత్త సాంగ్ అదుర్స్..
- February 10, 2023
హైదరాబాద్: ఇండియాలో మొట్ట మొదటిసారిగా ఈ ఫిబ్రవరి 11న నుంచి కారు రేసింగ్ ని నిర్వహించ బోతున్నారు. అది కూడా మన తెలుగు రాష్ట్రంలోని హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ రేసింగ్ ని హైదరాబాద్ లో జరిపేందుకు కొంత కాలంగా తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. అన్ని రకాలుగా ప్రమోషన్స్ చేస్తూ ఈ ఈవెంట్ ని జనాల్లోకి తీసుకు వెళుతున్నారు. మహేష్ బాబు, ప్రభాస్.. ఇలా టాలీవుడ్ లోని స్టార్ హీరోలు అందరి చేత ఈ ఈవెంట్ గురించి ప్రమోట్ చేయిస్తున్నారు.
కాగా ఇప్పుడు ప్రజలకి మరింత దగ్గర చేసేలా ఒక పాటని రెడీ చేయించారు. టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ ఈ సాంగ్ ని అందించాడు. ఫార్ములా-E హైదరాబాద్ కి వచ్చింది అంటూ సాగే ఈ పాట క్లాసికల్ అండ్ వెస్ట్రన్ టచ్ తో అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ తో ఒక మ్యూజికల్ వీడియోని కూడా చిత్రీకరించాడు థమన్. ఈ వీడియోలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ క్యామియో అపిరెన్స్ ఇచ్చి స్టెప్పులు వేసి అదరగొట్టాడు. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తరువాత డాన్స్ వేస్తూ కనబడింది ఈ విడియోలోనే, అది కూడా రేసింగ్ ఈవెంట్ కోసం గమనార్హం. దీంతో ఈ వీడియో సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.
కాగా నిన్న (ఫిబ్రవరి 9) రాత్రి ఈ రేసింగ్ ఈవెంట్ కి సంబంధించిన కారిక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర, టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- పిల్లల స్పోర్ట్స్ ట్రైనింగ్ పై హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్..పేరెంట్స్, డాక్టర్లు ఆందోళన..!!
- తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని తిరిగి తెరిచిన కువైట్
- ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్
- NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు









