హైదరాబాద్ పై థమన్ కొత్త సాంగ్ అదుర్స్..
- February 10, 2023
హైదరాబాద్: ఇండియాలో మొట్ట మొదటిసారిగా ఈ ఫిబ్రవరి 11న నుంచి కారు రేసింగ్ ని నిర్వహించ బోతున్నారు. అది కూడా మన తెలుగు రాష్ట్రంలోని హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ రేసింగ్ ని హైదరాబాద్ లో జరిపేందుకు కొంత కాలంగా తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. అన్ని రకాలుగా ప్రమోషన్స్ చేస్తూ ఈ ఈవెంట్ ని జనాల్లోకి తీసుకు వెళుతున్నారు. మహేష్ బాబు, ప్రభాస్.. ఇలా టాలీవుడ్ లోని స్టార్ హీరోలు అందరి చేత ఈ ఈవెంట్ గురించి ప్రమోట్ చేయిస్తున్నారు.
కాగా ఇప్పుడు ప్రజలకి మరింత దగ్గర చేసేలా ఒక పాటని రెడీ చేయించారు. టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ ఈ సాంగ్ ని అందించాడు. ఫార్ములా-E హైదరాబాద్ కి వచ్చింది అంటూ సాగే ఈ పాట క్లాసికల్ అండ్ వెస్ట్రన్ టచ్ తో అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ తో ఒక మ్యూజికల్ వీడియోని కూడా చిత్రీకరించాడు థమన్. ఈ వీడియోలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ క్యామియో అపిరెన్స్ ఇచ్చి స్టెప్పులు వేసి అదరగొట్టాడు. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తరువాత డాన్స్ వేస్తూ కనబడింది ఈ విడియోలోనే, అది కూడా రేసింగ్ ఈవెంట్ కోసం గమనార్హం. దీంతో ఈ వీడియో సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.
కాగా నిన్న (ఫిబ్రవరి 9) రాత్రి ఈ రేసింగ్ ఈవెంట్ కి సంబంధించిన కారిక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర, టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!