రోడ్లపై నిర్లక్ష్య డ్రైవింగ్.. 800 దిర్హామ్ల జరిమానా.. పోలీసుల హెచ్చరిక
- February 10, 2023
అబుధాబి: రోడ్డుపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని, పరధ్యానంలో డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు కారణం కావద్దని వాహనదారులను అబుధాబి పోలీసులు హెచ్చరించారు. రహదారిపై వాహనదారుడు పరధ్యానంలో ఉన్నప్పుడు జరిగే ట్రాఫిక్ ప్రమాదం గురించే తెలిపే వీడియోను కంట్రోల్ అండ్ ఫాలో-అప్ సెంటర్ సహకారంతో అథారిటీ షేర్ చేసింది. డ్రైవింగ్ చేసేటప్పుడు తమ ఫోన్ను ఉపయోగించవద్దని వాహనదారులను హెచ్చరించారు. ముఖ్యంగా డ్రైవింగ్ చేసే సమయంలో ఇంటర్నెట్లో సర్ఫ్ చేయడం, సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫారమ్లను ఉపయోగించడం, కాల్ చేయడం లేదా ఫోటోలు తీయడం లాంటివి చేయవద్దని.. ఇలా ప్రవర్తించడం ప్రమాదాలకు దారితీస్తుందని అధికార యంత్రాంగం తెలిపింది. ఇలాంటి ఉల్లంఘనకు జరిమానా 800 దిర్హామ్లు, నాలుగు ట్రాఫిక్ పాయింట్లను విధించనున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







