అమీర్ QR50 మిలియన్లతో.. QR140 మిలియన్లకు చేరిన విరాళాలు
- February 11, 2023
దోహా: ఖతార్ రెడ్ క్రెసెంట్ సొసైటీ, ఖతార్ ఛారిటీ, ఖతార్ అథారిటీ ఫర్ ఛారిటబుల్ యాక్టివిటీస్, ఖతార్ మీడియా కార్పొరేషన్ టర్కీ, సిరియాలో భూకంప బాధితుల కోసం శుక్రవారం ప్రారంభించిన "ఔన్ అండ్ సనద్" ప్రచారానికి అమీర్, హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ QR 50 మిలియన్లు విరాళంగా ఇచ్చారు. ఖతార్లోని కార్పొరేట్ సంస్థలు, వ్యక్తుల నుండి అధిక మద్దతు పొందిన ఈ ప్రచారంలో ఇప్పటివరకు QR140 మిలియన్లకు పైగా విరాళాలు సమకూరాయి. ఖతార్ నేషనల్ బ్యాంక్ (QNB), మినిస్ట్రీ ఆఫ్ ఎండోమెంట్స్ (Awqaf), ఇస్లామిక్ వ్యవహారాలు ఒక్కొక్కటి QR10 మిలియన్లు అందించాయి. ఊరేడూ, దోహా బ్యాంక్, గల్ఫ్ ఎక్స్ఛేంజ్ ఒక్కొక్కటి QR1 మిలియన్ విరాళం అందించగా, అల్ జజీరా మెడికల్ సెంటర్ QR900,000 ప్రకటించింది. అలాగే అజ్ఞాత దాతలు కొంతమంది QR4, QR5 మిలియన్ల వరకు వ్యక్తిగతంగా విరాళాలు ఇచ్చారు. చాలా మంది పౌరులు, నివాసితులు కూడా సౌక్ వాకిఫ్, ఆస్పైర్ పార్క్, కటారా వద్ద ఏర్పాటు చేసిన విరాళాల పాయింట్లలో విరాళాలు సమర్పిస్తున్నారని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









