అమీర్ QR50 మిలియన్లతో.. QR140 మిలియన్లకు చేరిన విరాళాలు
- February 11, 2023
దోహా: ఖతార్ రెడ్ క్రెసెంట్ సొసైటీ, ఖతార్ ఛారిటీ, ఖతార్ అథారిటీ ఫర్ ఛారిటబుల్ యాక్టివిటీస్, ఖతార్ మీడియా కార్పొరేషన్ టర్కీ, సిరియాలో భూకంప బాధితుల కోసం శుక్రవారం ప్రారంభించిన "ఔన్ అండ్ సనద్" ప్రచారానికి అమీర్, హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ QR 50 మిలియన్లు విరాళంగా ఇచ్చారు. ఖతార్లోని కార్పొరేట్ సంస్థలు, వ్యక్తుల నుండి అధిక మద్దతు పొందిన ఈ ప్రచారంలో ఇప్పటివరకు QR140 మిలియన్లకు పైగా విరాళాలు సమకూరాయి. ఖతార్ నేషనల్ బ్యాంక్ (QNB), మినిస్ట్రీ ఆఫ్ ఎండోమెంట్స్ (Awqaf), ఇస్లామిక్ వ్యవహారాలు ఒక్కొక్కటి QR10 మిలియన్లు అందించాయి. ఊరేడూ, దోహా బ్యాంక్, గల్ఫ్ ఎక్స్ఛేంజ్ ఒక్కొక్కటి QR1 మిలియన్ విరాళం అందించగా, అల్ జజీరా మెడికల్ సెంటర్ QR900,000 ప్రకటించింది. అలాగే అజ్ఞాత దాతలు కొంతమంది QR4, QR5 మిలియన్ల వరకు వ్యక్తిగతంగా విరాళాలు ఇచ్చారు. చాలా మంది పౌరులు, నివాసితులు కూడా సౌక్ వాకిఫ్, ఆస్పైర్ పార్క్, కటారా వద్ద ఏర్పాటు చేసిన విరాళాల పాయింట్లలో విరాళాలు సమర్పిస్తున్నారని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం







