అమీర్ QR50 మిలియన్లతో.. QR140 మిలియన్లకు చేరిన విరాళాలు
- February 11, 2023
దోహా: ఖతార్ రెడ్ క్రెసెంట్ సొసైటీ, ఖతార్ ఛారిటీ, ఖతార్ అథారిటీ ఫర్ ఛారిటబుల్ యాక్టివిటీస్, ఖతార్ మీడియా కార్పొరేషన్ టర్కీ, సిరియాలో భూకంప బాధితుల కోసం శుక్రవారం ప్రారంభించిన "ఔన్ అండ్ సనద్" ప్రచారానికి అమీర్, హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ QR 50 మిలియన్లు విరాళంగా ఇచ్చారు. ఖతార్లోని కార్పొరేట్ సంస్థలు, వ్యక్తుల నుండి అధిక మద్దతు పొందిన ఈ ప్రచారంలో ఇప్పటివరకు QR140 మిలియన్లకు పైగా విరాళాలు సమకూరాయి. ఖతార్ నేషనల్ బ్యాంక్ (QNB), మినిస్ట్రీ ఆఫ్ ఎండోమెంట్స్ (Awqaf), ఇస్లామిక్ వ్యవహారాలు ఒక్కొక్కటి QR10 మిలియన్లు అందించాయి. ఊరేడూ, దోహా బ్యాంక్, గల్ఫ్ ఎక్స్ఛేంజ్ ఒక్కొక్కటి QR1 మిలియన్ విరాళం అందించగా, అల్ జజీరా మెడికల్ సెంటర్ QR900,000 ప్రకటించింది. అలాగే అజ్ఞాత దాతలు కొంతమంది QR4, QR5 మిలియన్ల వరకు వ్యక్తిగతంగా విరాళాలు ఇచ్చారు. చాలా మంది పౌరులు, నివాసితులు కూడా సౌక్ వాకిఫ్, ఆస్పైర్ పార్క్, కటారా వద్ద ఏర్పాటు చేసిన విరాళాల పాయింట్లలో విరాళాలు సమర్పిస్తున్నారని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







