తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా
- February 11, 2023
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వం సచివాలయం ప్రారంబోత్సవాన్ని వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ సచివాలయంను ముందుగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజైనా ఫిబ్రవరి 17న ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ ప్రారంభోత్సవానికి పలు రాష్ట్రాల సీఎంలు, నాయకులనూ ఆహ్వానించారు. ఇంతలో తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఎలక్షన్ కోడ్ అమలులో ఉండడంతో సచివాలయం ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్లు ప్రభుత్వం చెప్పింది. త్వరలోనే కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి సంబంధించిన తేదీని ప్రకటించనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఒక టీచర్, ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఫిబ్రవరి 9వ తేదీన విడుదలైంది. ఫిబ్రవరి 16వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసి, ఫిబ్రవరి 23 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఆపై ఫిబ్రవరి 27వ తేదీన నామినేషన్ ల ఉపసంహరణ ఉంటుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో







