సుప్రీంకోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తులు
- February 13, 2023
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఈరోజు ఉదయం కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులు రాజేష్ బిందాల్, అరవింద్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. కొత్తగా పదవి పొందిన జస్టిస్ రాజేష్ బిందాల్, అరవింద్ కుమార్లతో భారత ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ డీవీ చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేయించారు. దాంతో, సుప్రీంకోర్టులో పూర్తి స్థాయి న్యాయమూర్తుల సంఖ్య 34కి చేరుకుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందకముందు జస్టిస్ బిందాల్ అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండగా, జస్టిస్ కుమార్ గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. వీరి రాకతో తొమ్మిది నెలల విరామం తర్వాత సుప్రీంకోర్టు పూర్తి స్థాయికి చేరుకుంది. అంతకుముందు ఫిబ్రవరి 6న సుప్రీంకోర్టుకు ఐదుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు.
భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ ఈ ఐదుగురు కొత్త న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో జస్టిస్లు పంకజ్ మిథాల్, సంజయ్ కరోల్, పీవీ సంజయ్ కుమార్, అహ్సానుద్దీన్ అమానుల్లా, మనోజ్ మిశ్రాలతో ప్రమాణం చేయించారు. డిసెంబర్ 13న సుప్రీంకోర్టు కొలీజియం వారి పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కోసం సిఫార్సు చేసింది. రాష్ట్రపతి దీనికి ఆమోద ముద్ర వేశారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







