ఒమన్లో భారీగా డ్రగ్స్ను స్వాధీనం.. నలుగురు అరెస్ట్
- February 13, 2023
మస్కట్: అంతర్జాతీయ ముఠాల సహకారంతో సుల్తానేట్లోకి మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలిస్తున్న నలుగురు వ్యక్తులను రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అరెస్టు చేశారు. “జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ కంట్రోల్ టీం సముద్రం ద్వారా దేశంలోకి అక్రమంగా తరలించడానికి ప్రయత్నిస్తుండగా.. 20 కిలోల కంటే ఎక్కువ క్రిస్టల్ మత్తుమందు, 17 కిలోల మార్ఫిన్ కలిగి ఉన్న ఆసియా జాతీయతకు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు." అని రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. దీంతోపాటు నార్త్ అల్ బటినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడిన ఒక వ్యక్తిని కూడా అరెస్టు చేసిందని పేర్కొంది. అతని వద్ద ఉన్న క్రిస్టల్, హషీష్ , వివిధ సైకోట్రోపిక్ టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. రెండు కేసుల్లో నిందితులపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని ROP తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







