6 ఏళ్ల చిన్నారిని రక్షించిన రోమియో, జూలీ
- February 13, 2023
యూఏఈ: భారత జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(NDRF) ఆరేళ్ల బాలికను రక్షించింది. సాహసోపేతమైన ఈ చర్యలో NDRF డాగ్ స్క్వాడ్లో భాగమైన రోమియో, జూలీలకు దక్కింది. యంత్రాలు విఫలమైన చోట రోమియో, జూలీ విజయం సాధించాయి. టన్నుల కొద్దీ శిథిలాల కింద చిన్నారి ఆచూకీని గుర్తించడంలో డాగ్ స్క్వాడ్ కీలకపాత్ర పోషించింది. వారి సహాయం లేకుండా ఆ చిన్నారి బతికేది కాదని నిపుణులు చెబుతున్నారు. ఫిబ్రవరి 6న సంభవించిన భూకంపం వల్ల తీవ్రంగా ప్రభావితమైన టర్కీలో NDRF బృందాలు సహాయక చర్యల్లో విస్తృతంగా పాల్గొంటున్నాయి. డాగ్ హ్యాండ్లర్ కానిస్టేబుల్ కుందన్ నూర్దగి సైట్లోని శిథిలాలలో మొదటగా బెరెన్గా గుర్తించబడిన చిన్న అమ్మాయిని జూలీ ఎలా గుర్తిందో వివరించాడు. "నూర్దగిలో శిథిలాలలో చిక్కుకున్న ప్రాణాలతో బయటపడింది. జూలీని శిథిలాల లోపలి వెళ్లింది. ఆపై మొరగడం ప్రారంభించింది. పాప జీవించి ఉందని చెప్పేందుకు ఇది సంకేతం. అనంతరం అనేక గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత NDRF సిబ్బంది 6 ఏళ్ల బెరెన్ను రక్షించడంలో విజయం సాధించారు.”అని అతను ANI కి చెప్పాడు. 7.8 తీవ్రతతో భూకంపం టర్కీని నాశనం చేసిన తర్వాత భారతదేశం 'ఆపరేషన్ దోస్త్' ప్రకటించింది. 'దోస్త్' కింద భూకంప దేశాలకు మానవతా సహాయంతో సహా 60 పారా ఫీల్డ్ హాస్పిటల్ సిబ్బంది, NDRF బృందాలను భారత్ పంపింది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!









