6 ఏళ్ల చిన్నారిని రక్షించిన రోమియో, జూలీ
- February 13, 2023
యూఏఈ: భారత జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(NDRF) ఆరేళ్ల బాలికను రక్షించింది. సాహసోపేతమైన ఈ చర్యలో NDRF డాగ్ స్క్వాడ్లో భాగమైన రోమియో, జూలీలకు దక్కింది. యంత్రాలు విఫలమైన చోట రోమియో, జూలీ విజయం సాధించాయి. టన్నుల కొద్దీ శిథిలాల కింద చిన్నారి ఆచూకీని గుర్తించడంలో డాగ్ స్క్వాడ్ కీలకపాత్ర పోషించింది. వారి సహాయం లేకుండా ఆ చిన్నారి బతికేది కాదని నిపుణులు చెబుతున్నారు. ఫిబ్రవరి 6న సంభవించిన భూకంపం వల్ల తీవ్రంగా ప్రభావితమైన టర్కీలో NDRF బృందాలు సహాయక చర్యల్లో విస్తృతంగా పాల్గొంటున్నాయి. డాగ్ హ్యాండ్లర్ కానిస్టేబుల్ కుందన్ నూర్దగి సైట్లోని శిథిలాలలో మొదటగా బెరెన్గా గుర్తించబడిన చిన్న అమ్మాయిని జూలీ ఎలా గుర్తిందో వివరించాడు. "నూర్దగిలో శిథిలాలలో చిక్కుకున్న ప్రాణాలతో బయటపడింది. జూలీని శిథిలాల లోపలి వెళ్లింది. ఆపై మొరగడం ప్రారంభించింది. పాప జీవించి ఉందని చెప్పేందుకు ఇది సంకేతం. అనంతరం అనేక గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత NDRF సిబ్బంది 6 ఏళ్ల బెరెన్ను రక్షించడంలో విజయం సాధించారు.”అని అతను ANI కి చెప్పాడు. 7.8 తీవ్రతతో భూకంపం టర్కీని నాశనం చేసిన తర్వాత భారతదేశం 'ఆపరేషన్ దోస్త్' ప్రకటించింది. 'దోస్త్' కింద భూకంప దేశాలకు మానవతా సహాయంతో సహా 60 పారా ఫీల్డ్ హాస్పిటల్ సిబ్బంది, NDRF బృందాలను భారత్ పంపింది.
తాజా వార్తలు
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..







