తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు మృతి
- February 16, 2023
తెలంగాణ: తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రతి రోజు పెను ప్రమాదాలు జరుగుతూ..మనుషుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. రోడ్ అద్భుతంగా ఉండడం తో వాహనదారులు జెట్ స్పీడ్ గా వెళ్తున్నారు. ఇందులో కొంతమంది నిద్ర మబ్బులో , మరికొంత మంది తాగి డ్రైవ్ చేసి ప్రమాదాలు చేస్తున్నారు.
తాజాగా చౌటుప్పల్ మండల పరిధిలోని దండు మల్కాపురం గ్రామం వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను ఓ ప్రైవేట్ బస్సు అత్యంత వేగంగా వచ్చి ఢీ కొట్టడం తో నలుగురు మహిళలు మృతి చెందగా..12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం ఉదయం రోజూవారిలాగానే 16 మంది మహిళలు ఆటోలో వెళ్తుండగా..మల్కాపురం గ్రామం వద్ద ప్రైవేట్ బస్సు స్పీడ్ గా వచ్చి ఆటో ను ఢీ కొట్టింది. దీంతో ఆటో లో ప్రయాణిస్తున్న వారు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.తీవ్రంగా గాయపడ్డ నలుగురు మహిళలు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందారు. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తిచేసి కుటుంబసభ్యులకు అందించారు. కూలీలందరూ దేవాలమ్మ నాగారం గ్రామస్తులుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









