తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు మృతి
- February 16, 2023
తెలంగాణ: తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రతి రోజు పెను ప్రమాదాలు జరుగుతూ..మనుషుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. రోడ్ అద్భుతంగా ఉండడం తో వాహనదారులు జెట్ స్పీడ్ గా వెళ్తున్నారు. ఇందులో కొంతమంది నిద్ర మబ్బులో , మరికొంత మంది తాగి డ్రైవ్ చేసి ప్రమాదాలు చేస్తున్నారు.
తాజాగా చౌటుప్పల్ మండల పరిధిలోని దండు మల్కాపురం గ్రామం వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను ఓ ప్రైవేట్ బస్సు అత్యంత వేగంగా వచ్చి ఢీ కొట్టడం తో నలుగురు మహిళలు మృతి చెందగా..12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం ఉదయం రోజూవారిలాగానే 16 మంది మహిళలు ఆటోలో వెళ్తుండగా..మల్కాపురం గ్రామం వద్ద ప్రైవేట్ బస్సు స్పీడ్ గా వచ్చి ఆటో ను ఢీ కొట్టింది. దీంతో ఆటో లో ప్రయాణిస్తున్న వారు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.తీవ్రంగా గాయపడ్డ నలుగురు మహిళలు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందారు. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తిచేసి కుటుంబసభ్యులకు అందించారు. కూలీలందరూ దేవాలమ్మ నాగారం గ్రామస్తులుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







