ఖతీఫ్ రన్ ఓవర్ ఘటనలో దోషులకు 15 ఏళ్ల జైలుశిక్ష
- February 16, 2023
సౌదీ: తూర్పు ప్రావిన్స్లోని ఖతీఫ్ గవర్నరేట్లోని 2022 డిసెంబర్లో జరిగిన రన్-ఓవర్ దోపిడీ సంఘటనలో దోషులుగా తేలిన ఇద్దరు సౌదీ పౌరులకు ఒక్కోక్కరికి 15 ఏళ్ల జైలుశిక్షను సౌదీ కోర్టు శిక్ష విధించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. నిందితులు తమ కారుతో ఓ వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టారు. అనంతరం కారునుంచి దిగిన నిందితులు సదరు బాధితుడి దగ్గర ఉన్న విలువైన వస్తువులు, నగదును తీసుకొని సంఘటన ప్రాంతం నుంచి పరారు అయ్యారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. వారిపై హత్యాయత్నం, దోపిడీకి సంబంధించిన సెక్షన్ల కింద కేసులను నమోదు చేసిన పబ్లిక్ ప్రాసిక్యూషన్.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టుకు రిఫర్ చేసింది. దుండగుల దాడిలో గాయపడ్డ బాధితుడు చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి వెళ్లిపోయారు.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







