ఈనెల చివరి వారంలో ప్రారంభం కానున్న మరో వందేభారత్ రైలు
- February 19, 2023
హైదరాబాద్: సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ రైలు అతి త్వరలో పట్టాలెక్కనుంది. ఈనెల చివరి వారంలో ఈ రైలు ప్రారంభం కానున్నట్లు ద.మ.రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ రైలును నడిపేందుకు ద.మ.రైల్వే అధికారులు బీబీనగర్, నడికుడి, మిర్యాలగూడ, వరంగల్, ఖాజీపేట, కడప, బీబీనగర్, గుంటూరు, నెల్లూరు, గూడూరు మూడు రూట్లను పరిశీలించి చివరకు బీబీనగర్, నడికుడి, మిర్యాలగూడ మార్గాన్ని దాదాపు ఖరారు చేశారు.ఈ మూడు రూట్లతో పోలిస్తే బీబీనగర్, నడికుడి, మిర్యాలగూడ తక్కువ దూరం ఉండటంతో అధికారులు ఆ మార్గాన్ని ఎంచుకున్నారు.
ఇదిలా ఉండగా, గంటకు 130 నుంచి 150 కి.మీ.ల వేగంతో దూసుకెళ్లే ఈ రైలు ధర రూ.1150 నుంచి ప్రారంభమవుతుందని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. టికెట్ చార్జి, రైలు నంబర్లు ఖరారు కాగానే ఐఆర్సీటీసీ వెబ్సైట్లో వివరాలు అప్లోడ్ చేస్తారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి నడుస్తున్న రైళ్లలో నారాయణదాద్రి ఎక్స్ప్రెస్కు ప్రయాణ సమయం 12 గంటలు పడుతుండగా, వందేభారత్ రైలు ప్రయాణం ఆరున్నర గంటల నుంచి 7 గంటలు పడుతుందని పేర్కొంటున్నారు. మరోమారు, ట్రాక్ పనులను పరిశీలించి సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిపే వందేభారత్ రైలు తేదీని ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!
- సీబీఎస్ఈ క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్ పై పేరెంట్స్ ఆందోళన..!!
- అల్ ఖోర్ మసీదులో కింగ్ సుల్తాన్ ఈద్ ప్రార్థనలు..!!
- ఈద్ వేడుకలు.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- మక్కాలోని గ్రాండ్ మసీదులో క్రౌన్ ప్రిన్స్ ఈద్ ప్రార్థనలు..!!
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ









