దోహా జ్యువెలరీ అండ్ వాచెస్ ఎగ్జిబిషన్ ప్రారంభం
- February 20, 2023
దోహా: 19వ దోహా జ్యువెలరీ అండ్ వాచెస్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. దోహా ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ (DECC)లో ఫిబ్రవరి 25 వరకు ఇది కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా 500 పైగా ఆభరణాలు, వాచ్ బ్రాండ్లు ఈ ప్రదర్శనలో పాల్గొంటాయని నిర్వాహకులు ప్రకటించారు. చారిత్రాత్మకంగా దేశంలోని అత్యంత గుర్తింపు పొందిన కొన్ని సమకాలీన ఆభరణాలు, వాచ్ బ్రాండ్లు తమ వ్యాపారాలను మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుందని తెలిపారు. ఎగ్జిబిషన్కు 30,000 మందికి పైగా సందర్శకులు వస్తారని నిర్వాహకులు భావిస్తున్నారు. డమాస్ జ్యువెలరీ వారి అలీఫ్ సేకరణ, అసాధారణమైన హై-ఎండ్ డైమండ్స్, ప్రత్యేకమైన ఆభరణాల క్రియేషన్స్, లూయిస్ విట్టన్ వారి "ఫాంటసీ నెక్లెస్", 2.56 క్యారెట్ మోనోగ్రామ్ ఫ్లవర్ కట్ డైమండ్లు ఈసారి ప్రత్యేక ఆకర్షణలుగా నిలువనున్నాయి. ఈవెంట్లో మొదటిసారిగా టర్కిష్, భారతీయ పెవిలియన్లు ప్రత్యేక వారసత్వం, సంస్కృతిని తెలిపే డిజైన్లతో పాల్గొంటున్నాయి. కస్టమర్లు తమ ఆభరణాలను అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సంస్థ ద్వారా పరీక్షించి, సర్టిఫికేట్ పొందవచ్చు.
తాజా వార్తలు
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







