దోహా జ్యువెలరీ అండ్ వాచెస్ ఎగ్జిబిషన్ ప్రారంభం
- February 20, 2023
దోహా: 19వ దోహా జ్యువెలరీ అండ్ వాచెస్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. దోహా ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ (DECC)లో ఫిబ్రవరి 25 వరకు ఇది కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా 500 పైగా ఆభరణాలు, వాచ్ బ్రాండ్లు ఈ ప్రదర్శనలో పాల్గొంటాయని నిర్వాహకులు ప్రకటించారు. చారిత్రాత్మకంగా దేశంలోని అత్యంత గుర్తింపు పొందిన కొన్ని సమకాలీన ఆభరణాలు, వాచ్ బ్రాండ్లు తమ వ్యాపారాలను మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుందని తెలిపారు. ఎగ్జిబిషన్కు 30,000 మందికి పైగా సందర్శకులు వస్తారని నిర్వాహకులు భావిస్తున్నారు. డమాస్ జ్యువెలరీ వారి అలీఫ్ సేకరణ, అసాధారణమైన హై-ఎండ్ డైమండ్స్, ప్రత్యేకమైన ఆభరణాల క్రియేషన్స్, లూయిస్ విట్టన్ వారి "ఫాంటసీ నెక్లెస్", 2.56 క్యారెట్ మోనోగ్రామ్ ఫ్లవర్ కట్ డైమండ్లు ఈసారి ప్రత్యేక ఆకర్షణలుగా నిలువనున్నాయి. ఈవెంట్లో మొదటిసారిగా టర్కిష్, భారతీయ పెవిలియన్లు ప్రత్యేక వారసత్వం, సంస్కృతిని తెలిపే డిజైన్లతో పాల్గొంటున్నాయి. కస్టమర్లు తమ ఆభరణాలను అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సంస్థ ద్వారా పరీక్షించి, సర్టిఫికేట్ పొందవచ్చు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







