పాలతో కలిపి ఈ పదార్ధాలు తీసుకుంటున్నారా.? తస్మాత్ జాగ్రత్త.!
- February 21, 2023
కొన్ని రకాల ఆహార పదార్ధాలను కలిపి తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. కూరగాయలను మిక్సింగ్ చేసి వండడం సర్వసాధారణం. అయితే, కూరగాయలతో ఒక్కోసారి పాలను మిక్స్ చేస్తూ చేసే వంటకాలుంటాయ్. వాటితోనే నష్టం అంటున్నారు.
పాలలో చక్కెర తప్ప ఇంకేదీ మిక్స్ చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. పాలతో కలిపి సాల్ట్ బిస్కెట్స్ కూడా తీసుకోకూడదని అంటున్నారు. అలాగే పండ్లను తిన్న తర్వాత వెంటనే పాలు తాగరాదట. వేడి వేడి పాలలో తేనెను మిక్స్ చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.
ఉడికించిన గుడ్డుతో పాలను తీసుకోవడం సర్వసాధారణం. ఈ కాంబినేషన్ కూడా సరైనది కాదని అంటున్నారు. ఈ రెండింట్లోనూ ప్రొటీన్లు అధికంగా వుంటాయ్. డబుల్ డోస్లో శరీరానికి ప్రోటీన్లు ఒకేసారి అందించడం అంత మంచిది కాదని చెబుతున్నారు. అలా చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు తలెత్తే అవకాశాలున్నాయట.
ముల్లంగితోనూ పాలను మిక్స్ చేయరాదట. మినపప్పుతో చేసిన ఆహారం తీసుకున్న వెంటనే కూడా పాలను తీసుకోరాదట. కూరగాయలతో కలిపి చేసిన కిచిడీని పాలతో మిక్స్ చేసి తినడం కొందరికి అలవాటు. కానీ, ఆ అలవాటు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







