పాలతో కలిపి ఈ పదార్ధాలు తీసుకుంటున్నారా.? తస్మాత్ జాగ్రత్త.!
- February 21, 2023కొన్ని రకాల ఆహార పదార్ధాలను కలిపి తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. కూరగాయలను మిక్సింగ్ చేసి వండడం సర్వసాధారణం. అయితే, కూరగాయలతో ఒక్కోసారి పాలను మిక్స్ చేస్తూ చేసే వంటకాలుంటాయ్. వాటితోనే నష్టం అంటున్నారు.
పాలలో చక్కెర తప్ప ఇంకేదీ మిక్స్ చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. పాలతో కలిపి సాల్ట్ బిస్కెట్స్ కూడా తీసుకోకూడదని అంటున్నారు. అలాగే పండ్లను తిన్న తర్వాత వెంటనే పాలు తాగరాదట. వేడి వేడి పాలలో తేనెను మిక్స్ చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.
ఉడికించిన గుడ్డుతో పాలను తీసుకోవడం సర్వసాధారణం. ఈ కాంబినేషన్ కూడా సరైనది కాదని అంటున్నారు. ఈ రెండింట్లోనూ ప్రొటీన్లు అధికంగా వుంటాయ్. డబుల్ డోస్లో శరీరానికి ప్రోటీన్లు ఒకేసారి అందించడం అంత మంచిది కాదని చెబుతున్నారు. అలా చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు తలెత్తే అవకాశాలున్నాయట.
ముల్లంగితోనూ పాలను మిక్స్ చేయరాదట. మినపప్పుతో చేసిన ఆహారం తీసుకున్న వెంటనే కూడా పాలను తీసుకోరాదట. కూరగాయలతో కలిపి చేసిన కిచిడీని పాలతో మిక్స్ చేసి తినడం కొందరికి అలవాటు. కానీ, ఆ అలవాటు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో