పాలతో కలిపి ఈ పదార్ధాలు తీసుకుంటున్నారా.? తస్మాత్ జాగ్రత్త.!
- February 21, 2023కొన్ని రకాల ఆహార పదార్ధాలను కలిపి తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. కూరగాయలను మిక్సింగ్ చేసి వండడం సర్వసాధారణం. అయితే, కూరగాయలతో ఒక్కోసారి పాలను మిక్స్ చేస్తూ చేసే వంటకాలుంటాయ్. వాటితోనే నష్టం అంటున్నారు.
పాలలో చక్కెర తప్ప ఇంకేదీ మిక్స్ చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. పాలతో కలిపి సాల్ట్ బిస్కెట్స్ కూడా తీసుకోకూడదని అంటున్నారు. అలాగే పండ్లను తిన్న తర్వాత వెంటనే పాలు తాగరాదట. వేడి వేడి పాలలో తేనెను మిక్స్ చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.
ఉడికించిన గుడ్డుతో పాలను తీసుకోవడం సర్వసాధారణం. ఈ కాంబినేషన్ కూడా సరైనది కాదని అంటున్నారు. ఈ రెండింట్లోనూ ప్రొటీన్లు అధికంగా వుంటాయ్. డబుల్ డోస్లో శరీరానికి ప్రోటీన్లు ఒకేసారి అందించడం అంత మంచిది కాదని చెబుతున్నారు. అలా చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు తలెత్తే అవకాశాలున్నాయట.
ముల్లంగితోనూ పాలను మిక్స్ చేయరాదట. మినపప్పుతో చేసిన ఆహారం తీసుకున్న వెంటనే కూడా పాలను తీసుకోరాదట. కూరగాయలతో కలిపి చేసిన కిచిడీని పాలతో మిక్స్ చేసి తినడం కొందరికి అలవాటు. కానీ, ఆ అలవాటు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..