మద్యం మత్తులో కెనాల్లోకి దూకిన వ్యక్తి.. Dh5,000 జరిమానా
- February 22, 2023
యూఏఈ: దుబాయ్ వాటర్ కెనాల్లో దూకిన 34 ఏళ్ల గల్ఫ్ దేశస్థుడిని మెరైన్ రెస్క్యూ పెట్రోల్ సిబ్బంది రక్షించారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. మత్తు పదార్థాలు సేవించినట్లు తేలింది. క్రిమినల్ లేబొరేటరీ నివేదిక ప్రకారం.. ఫెడరల్ చట్టంలోని డ్రగ్ షెడ్యూల్ నంబర్ 5 అండ్ 8లో జాబితా చేయబడిన మత్తుపదార్థాలను ఆ వ్యక్తి ఉపయోగించినట్లు గుర్తించారు. విచారణలో అతను సైకోట్రోపిక్ పదార్థాలను ఉపయోగించినట్లు అంగీకరించినప్పటికీ, అతను కోర్టు ముందు తనపై వచ్చిన ఆరోపణలను తిరస్కరించాడు. మానసిక వ్యాధికి చికిత్స చేయడానికే వాటిని తీసుకున్నానని, డ్రగ్స్ వాడడాన్ని సమర్థించుకున్నాడు. కాగా అతను ఈ వాదనను నిరూపించలేకపోయాడు. దీంతో అతన్ని కోర్టు దోషిగా నిర్ధారించి Dh5,000 జరిమానా విధించింది. అలాగే అతని బ్యాంకింగ్ కార్యాకలాపాలను దుబాయ్ మిస్డిమినర్, ఉల్లంఘనల కోర్టు రెండేళ్లపాటు నిషేధించింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!