మద్యం మత్తులో కెనాల్లోకి దూకిన వ్యక్తి.. Dh5,000 జరిమానా
- February 22, 2023
యూఏఈ: దుబాయ్ వాటర్ కెనాల్లో దూకిన 34 ఏళ్ల గల్ఫ్ దేశస్థుడిని మెరైన్ రెస్క్యూ పెట్రోల్ సిబ్బంది రక్షించారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. మత్తు పదార్థాలు సేవించినట్లు తేలింది. క్రిమినల్ లేబొరేటరీ నివేదిక ప్రకారం.. ఫెడరల్ చట్టంలోని డ్రగ్ షెడ్యూల్ నంబర్ 5 అండ్ 8లో జాబితా చేయబడిన మత్తుపదార్థాలను ఆ వ్యక్తి ఉపయోగించినట్లు గుర్తించారు. విచారణలో అతను సైకోట్రోపిక్ పదార్థాలను ఉపయోగించినట్లు అంగీకరించినప్పటికీ, అతను కోర్టు ముందు తనపై వచ్చిన ఆరోపణలను తిరస్కరించాడు. మానసిక వ్యాధికి చికిత్స చేయడానికే వాటిని తీసుకున్నానని, డ్రగ్స్ వాడడాన్ని సమర్థించుకున్నాడు. కాగా అతను ఈ వాదనను నిరూపించలేకపోయాడు. దీంతో అతన్ని కోర్టు దోషిగా నిర్ధారించి Dh5,000 జరిమానా విధించింది. అలాగే అతని బ్యాంకింగ్ కార్యాకలాపాలను దుబాయ్ మిస్డిమినర్, ఉల్లంఘనల కోర్టు రెండేళ్లపాటు నిషేధించింది.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







