మద్యం మత్తులో కెనాల్లోకి దూకిన వ్యక్తి.. Dh5,000 జరిమానా
- February 22, 2023యూఏఈ: దుబాయ్ వాటర్ కెనాల్లో దూకిన 34 ఏళ్ల గల్ఫ్ దేశస్థుడిని మెరైన్ రెస్క్యూ పెట్రోల్ సిబ్బంది రక్షించారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. మత్తు పదార్థాలు సేవించినట్లు తేలింది. క్రిమినల్ లేబొరేటరీ నివేదిక ప్రకారం.. ఫెడరల్ చట్టంలోని డ్రగ్ షెడ్యూల్ నంబర్ 5 అండ్ 8లో జాబితా చేయబడిన మత్తుపదార్థాలను ఆ వ్యక్తి ఉపయోగించినట్లు గుర్తించారు. విచారణలో అతను సైకోట్రోపిక్ పదార్థాలను ఉపయోగించినట్లు అంగీకరించినప్పటికీ, అతను కోర్టు ముందు తనపై వచ్చిన ఆరోపణలను తిరస్కరించాడు. మానసిక వ్యాధికి చికిత్స చేయడానికే వాటిని తీసుకున్నానని, డ్రగ్స్ వాడడాన్ని సమర్థించుకున్నాడు. కాగా అతను ఈ వాదనను నిరూపించలేకపోయాడు. దీంతో అతన్ని కోర్టు దోషిగా నిర్ధారించి Dh5,000 జరిమానా విధించింది. అలాగే అతని బ్యాంకింగ్ కార్యాకలాపాలను దుబాయ్ మిస్డిమినర్, ఉల్లంఘనల కోర్టు రెండేళ్లపాటు నిషేధించింది.
తాజా వార్తలు
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు