మద్యం మత్తులో కెనాల్లోకి దూకిన వ్యక్తి.. Dh5,000 జరిమానా
- February 22, 2023యూఏఈ: దుబాయ్ వాటర్ కెనాల్లో దూకిన 34 ఏళ్ల గల్ఫ్ దేశస్థుడిని మెరైన్ రెస్క్యూ పెట్రోల్ సిబ్బంది రక్షించారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. మత్తు పదార్థాలు సేవించినట్లు తేలింది. క్రిమినల్ లేబొరేటరీ నివేదిక ప్రకారం.. ఫెడరల్ చట్టంలోని డ్రగ్ షెడ్యూల్ నంబర్ 5 అండ్ 8లో జాబితా చేయబడిన మత్తుపదార్థాలను ఆ వ్యక్తి ఉపయోగించినట్లు గుర్తించారు. విచారణలో అతను సైకోట్రోపిక్ పదార్థాలను ఉపయోగించినట్లు అంగీకరించినప్పటికీ, అతను కోర్టు ముందు తనపై వచ్చిన ఆరోపణలను తిరస్కరించాడు. మానసిక వ్యాధికి చికిత్స చేయడానికే వాటిని తీసుకున్నానని, డ్రగ్స్ వాడడాన్ని సమర్థించుకున్నాడు. కాగా అతను ఈ వాదనను నిరూపించలేకపోయాడు. దీంతో అతన్ని కోర్టు దోషిగా నిర్ధారించి Dh5,000 జరిమానా విధించింది. అలాగే అతని బ్యాంకింగ్ కార్యాకలాపాలను దుబాయ్ మిస్డిమినర్, ఉల్లంఘనల కోర్టు రెండేళ్లపాటు నిషేధించింది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్