నిన్న కుక్కలు , నేడు కోతులు ..తెలంగాణ లో పసి పిల్లల పై వరుస దాడులు
- February 23, 2023
తెలంగాణ లో కుక్కలు , కోతుల దాడులు ఎక్కువైపోతున్నాయి. ఒంటరిగా పసి పిల్లలు కనిపిస్తే చాలు వారిపై దాడులకు పాల్పడుతున్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్ లోని పెద్ద అంబర్ పేట్ లో నాలుగేళ్ల బాలుడి ఫై మూడు కుక్కలు దాడి చేసి చంపేశాయి. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ గా మారింది. దీనిపై స్థానికులు , రాజకీయ పార్టీ లు సైతం GHMC ఫై ఆగ్రహం వ్యక్తం చేసాయి. ఈ దాడి గురించి ఇంకా మాట్లాడుతుండగానే తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోదుగుల గూడెం లో ఓ చిన్నారిపై కోతులు దాడి చేశాయి. పాపను వరండాలోని ఉయ్యాలలో పడుకోబెట్టి నీళ్ల కోసం తల్లి ఇంట్లోకి వెళ్ళింది.
ఈ తరుణంలోనే కోతులు ఒకసారిగా ఆ చిన్నారిపై దాడి చేశాయి. చిన్నారి కాలి బొటనవేలును కొరికాయి. దీంతో వెంటనే తల్లిదండ్రులు మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి ఆ చిన్నారిని తీసుకువెళ్లారు. ఇక అత్యవసర మెరుగైన వైద్యం కోసం వైద్యులు అక్కడి నుంచి వరంగల్ తరలించారు. ఇక ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గత కొద్దీ నెలలుగా గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని గ్రామస్థులు చెపుతున్నారు. పంటపొలాలను నాశనం చేయడమే కాకుండా ఇళ్లలోకి వచ్చి నానా బీబత్సం చేస్తున్నాయని , మనుషుల ఫై దాడి చేస్తున్నాయని వారంతా చెపుతున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
- యూఏఈలో త్వరలో స్టార్లింక్.. ముందస్తు బుకింగ్ ఎలాగంటే?
- ఖతార్లో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం 2026..!!
- బహ్రెయిన్లోని రిఫాలో ట్రాఫిక్ రద్దీకి చెక్..!!
- గల్ఫ్ పౌరుడి హత్య కేసులో బంగ్లాదేశీయుడు అరెస్ట్..!!
- సౌదీలో ఉరుములు.. భారీ వర్షాలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియంలో అరుదైన ఘనత..!!
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు







