టీడీపీలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ
- February 23, 2023టీడీపీలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ
విజయవాడ: మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సమక్షంలో టీడీపీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి టీడీపీ కార్యాలయంలో కన్నాకు చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కన్నాతో పాటు ఆయన అనుచరులు టీడీపీలో చేరారు. టీడీపీ కార్యాలయ పరిసరాలు ఆ పార్టీ కార్యకర్తలలో నిండిపోయాయి. స్టేజీపై తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది.
కన్నా లక్ష్మీనారాయణ ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గుంటూరు నుంచి కన్నా లక్ష్మీనారాయణ ఇవాళ మంగళగిరి టీడీపీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. ఆయనతో వేలాది మంది అభిమానులు వచ్చారు. గుంటూరులోని కన్నా లక్ష్మీనారాయణ ఇంటి వద్ద కూడా టీడీపీ ఫ్లెక్సీలు భారీగా కనపడ్డాయి. మాజీ సీఎంలు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడితో పాటు టీడీపీ నేత లోకేశ్ ఫ్లెక్సీలను కార్యకర్తలు ఏర్పాటు చేశారు.
గుంటూరు జిల్లాలో కన్నా లక్ష్మీనారాయణకు కాపు సామాజిక వర్గంలో పట్టు ఉంది.నిన్న పలువురు టీడీపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు.ఏపీ బీజేపీ నేతల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీకి రాజీనామా చేశారు. మరికొందరు బీజేపీ నేతలు కూడా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీరు పట్ల అసంతృప్తితో ఉన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?