చూపులేని వారికోసం ఫేస్బుక్ సరికొత్త సదుపాయం
- May 03, 2016
చూపులేని వారికోసం సోషల్మీడియా దిగ్గజం ఫేస్బుక్ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. స్నేహితులు పోస్ట్ చేసిన ఫొటోలు.. వీడియోల పూర్తి వివరాలను మాటల్లో చెప్పే ఫీచర్ను తీసుకొస్తున్నట్లు ఫేస్బుక్ వెల్లడించింది.ఫేస్బుక్లో పోస్టు చేసిన ఫొటోలు.. వీడియోలను చూడాలంటే చూపులేని వారికి సాధ్యపడదు. ఇంతకుముందు అయితే కేవలం టైంలైన్పై ఎవరు పోస్టు చేశారు..? వాళ్లు ఫొటో షేర్ చేశారా.. మరేదైనా పంపారా అనేది మాత్రమే తెలుసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అందులో మార్పులు చేసి.. టైంలైన్ని స్క్రోల్ చేసినపుడు పోస్టును ఎవరు చేశారనే దాంతో పాటు ఫొటోలో ఎంతమంది ఉన్నారు..? వారు ఏ మూడ్లో ఉన్నారు..? ఏ ప్రదేశంలో దిగారు..? అన్న వివరాలను కూడా చెప్పేస్తుంది. ఫొటో బ్యాక్గ్రౌండ్ లొకేషన్ను స్కాన్ చేసి.. దానికి సంబంధించిన పూర్తి వివరాలను చెబుతుందట.
'ఆబ్జెక్ట్ రికగ్నిషన్ టెక్నాలజీ'తో ఈ టూల్ను అభివృద్ధి చేసినట్లు ఫేస్బుక్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ కొత్త ఫీచర్ తొలుత ఐఓఎస్ డివైజ్ల్లో అందుబాటులోకి రానుందట.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







