చూపులేని వారికోసం ఫేస్‌బుక్‌ సరికొత్త సదుపాయం

- May 03, 2016 , by Maagulf
చూపులేని వారికోసం ఫేస్‌బుక్‌ సరికొత్త సదుపాయం

చూపులేని వారికోసం సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. స్నేహితులు పోస్ట్‌ చేసిన ఫొటోలు.. వీడియోల పూర్తి వివరాలను మాటల్లో చెప్పే ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు ఫేస్‌బుక్‌ వెల్లడించింది.ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన ఫొటోలు.. వీడియోలను చూడాలంటే చూపులేని వారికి సాధ్యపడదు. ఇంతకుముందు అయితే కేవలం టైంలైన్‌పై ఎవరు పోస్టు చేశారు..? వాళ్లు ఫొటో షేర్‌ చేశారా.. మరేదైనా పంపారా అనేది మాత్రమే తెలుసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అందులో మార్పులు చేసి.. టైంలైన్‌ని స్క్రోల్‌ చేసినపుడు పోస్టును ఎవరు చేశారనే దాంతో పాటు ఫొటోలో ఎంతమంది ఉన్నారు..? వారు ఏ మూడ్‌లో ఉన్నారు..? ఏ ప్రదేశంలో దిగారు..? అన్న వివరాలను కూడా చెప్పేస్తుంది. ఫొటో బ్యాక్‌గ్రౌండ్‌ లొకేషన్‌ను స్కాన్‌ చేసి.. దానికి సంబంధించిన పూర్తి వివరాలను చెబుతుందట.
'ఆబ్జెక్ట్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ'తో ఈ టూల్‌ను అభివృద్ధి చేసినట్లు ఫేస్‌బుక్‌ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ కొత్త ఫీచర్‌ తొలుత ఐఓఎస్‌ డివైజ్‌ల్లో అందుబాటులోకి రానుందట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com