చరణ్ ఖాతాలో మరో అరుదైన గౌరవం.!
- February 24, 2023అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన టాక్ షోగా పాపులర్ అయిన ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా వెళ్లారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ షోకి అతిధిగా వెళ్లిన తొలి తెలుగు నటుడు చరణ్ కావడం విశేషం.
అలాగే, తొలి ఇండియన్ నటుడు కూడా రామ్ చరణే కావడం మరో విశేషం. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ పురస్కారాల ప్రధానోత్సవంలో పాల్గొనేందుకు రామ్ చరణ్ న్యూయార్క్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే ఈ టాక్ షోకి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. గ్లోబల్ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి ఈ సందర్భంగా ఆయన ముచ్చటించారు.
అలాగే, హాలీవుడ్ సినిమాలో నటించాలని వుందన్న తన మనసులోని కోరికను సైతం బయటపెట్టారు. హాలీవుడ్ డైరెక్టర్లు ఇండియన్ నటుల పైనా, తెలుగు సినీ నటులపైనా, కూడా ఫోకస్ పెట్టాలని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..