శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమ బంగారం పట్టివేత
- February 25, 2023
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి అక్రమ బంగారం పట్టుబడింది.దుబాయ్ నుంచి ఎమిరేట్స్ EK528 విమానంలో వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ నిర్వహించారు.ఈ క్రమంలో ఓ వ్యక్తి వద్ద 823 గ్రాముల బంగారం పట్టుబడింది.దాని విలువ రూ.47 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.బంగారాన్ని పేస్టుగా మార్చి, ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేశాడని, దానిని లోదుస్తుల్లో దాచి తరలించే యత్నం చేశాడని చెప్పారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని వెల్లడించారు.
రెండు రోజుల క్రితం ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టుబడిన విషయం తెలిసిందే. సూడాన్ జాతీయులైన 23 మంది మహిళలు సూడాన్ నుంచి షార్జా మీదుగా గురువారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. వారి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు వారిని తనిఖీ చేశారు. దీంతో 14 కేజీల 906 గ్రాముల బంగారం లభించింది. దీనివిలువ రూ.7.89 కోట్లు ఉంటుందని నిర్ధారించారు. బూట్ల అడుగున ప్రత్యేకంగా తయారు చేసిన భాగంలో ఆభరణాలను ఉంచి తరలిస్తున్నారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..