విటమిన్ ‘డి’ లోపిస్తే కలిగే అనర్ధాలేంటో తెలుసా.?
- February 27, 2023శరీరంలో ఎముకలు బలిష్టంగా వుండాలంటే తగిన మోతాదులో శరీరానికి విటమిన్ డి లభించాలి. ఉదయాన్నే వచ్చే లేలేత సూర్య కిరణాలు.. సాయంత్రం తాకే సూర్య కిరణాల్లో విటమిన్ డి అధికంగా వుంటుందన్న సంగతి తెలిసిందే.
అందుకే, ఉదయం, సాయంత్రం కాసేపు ఎండలో వుంటే విటమిన్ డి ఫుష్కలంగా లభిస్తుందని చెబుతుంటారు. అవును నిజమే. ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో ఎండకు చాలా దూరంగా జీవిస్తున్నారు. నాగరికత పేరు చెప్పి, ఏసీ రూముల్లోనూ వెంటిలేషన్ లేని ఇళ్లలోనూ జివించాల్సి వస్తోంది. ఈ కారణంగా విటమిన్ డి బాధితులు అధికమవుతున్నారు.
విటమిన్ డి లోపిస్తే.. ఎముకలు పలచబడిపోయి పటుత్వం కోల్పోతాయ్. దాంతో చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు, ఆస్థియోఫోరోసిస్ వంటి వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. తొందరగా అలిసిపోవడం, కండరాలు పట్టేయడం వంటి సమస్యల్ని కూడా సాధారణంగా ఎదుర్కోవాల్సి వస్తుంటుంది.
అందుకే, ఎండతో పాటూ, విటమిన్ డి సమృద్ధిగా లభించే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తీసుకోవడంతో పాటూ, కనీసం రోజులో అరగంటైనా సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. అలాగే, శారీరక శ్రమ, చిన్నపాటి వ్యాయామాలు, నడక, యోగా వంటివి చేయడం తప్పని సరి అని సంబంధిత నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..