పౌరులకు 8,500 ల్యాండ్ ప్లాట్లను కేటాయించిన షేక్ మొహమ్మద్
- February 28, 2023
యూఏఈ: అల్ యలైస్ 5 ఏరియాలో ఎమిరాటీ పౌరులకు 8,500 ల్యాండ్ ప్లాట్లను వెంటనే కేటాయించాలని దుబాయ్ పాలకుడు, యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాలు జారీ చేశారు. ప్లాట్లు 120 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. జాతీయ గృహనిర్మాణ కార్యక్రమంలో భాగంగా ప్లాట్ల కేటాయింపును వేగవంతం చేయాలనే షేక్ మొహమ్మద్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
అల్ యలాయిస్ 5 ఏరియాలో 10కిలోమీటర్ల విస్తీర్ణంలో పచ్చని ప్రాంతాలను వాకింగ్, స్పోర్ట్స్ యాక్టివిటీస్కు అనుకూలంగా అభివృద్ధి చేస్తున్నారు. అదే విధంగా 11 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో జనరల్ స్టోర్స్, జిమ్, సైక్లింగ్ ట్రాక్ వంటి వినోద ప్రదేశాలు, ఇతర సౌకర్యాలను డెవలప్ చేస్తున్నారు. ప్లాట్ల కేటాయింపు మొదటి దశ ఫిబ్రవరి 28 నుండి ప్రారంభమవుతుంది. దుబాయ్ నౌ యాప్లోని ‘ఎమిరాటి’ డిజిటల్ ప్లాట్ఫారమ్ను ఉపయోగించి పౌరులు తమ అవసరాలకు సరిపోయే ప్లాట్ను ఎంచుకోవచ్చు. ఒక కుటుంబంలోని సభ్యులకు అదే పరిసర ప్రాంతంలో ప్లాట్ కేటాయించడంలో ప్రాధాన్యత ఇవ్వబడుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







