పౌరులకు 8,500 ల్యాండ్ ప్లాట్లను కేటాయించిన షేక్ మొహమ్మద్
- February 28, 2023
యూఏఈ: అల్ యలైస్ 5 ఏరియాలో ఎమిరాటీ పౌరులకు 8,500 ల్యాండ్ ప్లాట్లను వెంటనే కేటాయించాలని దుబాయ్ పాలకుడు, యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాలు జారీ చేశారు. ప్లాట్లు 120 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. జాతీయ గృహనిర్మాణ కార్యక్రమంలో భాగంగా ప్లాట్ల కేటాయింపును వేగవంతం చేయాలనే షేక్ మొహమ్మద్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
అల్ యలాయిస్ 5 ఏరియాలో 10కిలోమీటర్ల విస్తీర్ణంలో పచ్చని ప్రాంతాలను వాకింగ్, స్పోర్ట్స్ యాక్టివిటీస్కు అనుకూలంగా అభివృద్ధి చేస్తున్నారు. అదే విధంగా 11 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో జనరల్ స్టోర్స్, జిమ్, సైక్లింగ్ ట్రాక్ వంటి వినోద ప్రదేశాలు, ఇతర సౌకర్యాలను డెవలప్ చేస్తున్నారు. ప్లాట్ల కేటాయింపు మొదటి దశ ఫిబ్రవరి 28 నుండి ప్రారంభమవుతుంది. దుబాయ్ నౌ యాప్లోని ‘ఎమిరాటి’ డిజిటల్ ప్లాట్ఫారమ్ను ఉపయోగించి పౌరులు తమ అవసరాలకు సరిపోయే ప్లాట్ను ఎంచుకోవచ్చు. ఒక కుటుంబంలోని సభ్యులకు అదే పరిసర ప్రాంతంలో ప్లాట్ కేటాయించడంలో ప్రాధాన్యత ఇవ్వబడుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







