పౌరులకు 8,500 ల్యాండ్ ప్లాట్లను కేటాయించిన షేక్ మొహమ్మద్

- February 28, 2023 , by Maagulf
పౌరులకు 8,500 ల్యాండ్ ప్లాట్లను కేటాయించిన షేక్ మొహమ్మద్

యూఏఈ: అల్ యలైస్ 5 ఏరియాలో ఎమిరాటీ పౌరులకు 8,500 ల్యాండ్ ప్లాట్లను వెంటనే కేటాయించాలని దుబాయ్ పాలకుడు, యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాలు జారీ చేశారు. ప్లాట్లు 120 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. జాతీయ గృహనిర్మాణ కార్యక్రమంలో భాగంగా ప్లాట్ల కేటాయింపును వేగవంతం చేయాలనే షేక్ మొహమ్మద్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.

అల్ యలాయిస్ 5 ఏరియాలో 10కిలోమీటర్ల విస్తీర్ణంలో పచ్చని ప్రాంతాలను వాకింగ్, స్పోర్ట్స్ యాక్టివిటీస్‌కు అనుకూలంగా అభివృద్ధి చేస్తున్నారు. అదే విధంగా 11 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో జనరల్ స్టోర్స్, జిమ్, సైక్లింగ్ ట్రాక్ వంటి వినోద ప్రదేశాలు, ఇతర సౌకర్యాలను డెవలప్ చేస్తున్నారు. ప్లాట్ల కేటాయింపు మొదటి దశ ఫిబ్రవరి 28 నుండి ప్రారంభమవుతుంది. దుబాయ్ నౌ యాప్‌లోని ‘ఎమిరాటి’ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించి పౌరులు తమ అవసరాలకు సరిపోయే ప్లాట్‌ను ఎంచుకోవచ్చు. ఒక కుటుంబంలోని సభ్యులకు అదే పరిసర ప్రాంతంలో ప్లాట్ కేటాయించడంలో ప్రాధాన్యత ఇవ్వబడుతుందని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com