అల్ రషీద్ ఎక్స్ఛేంజ్ కంపెనీ లైసెన్స్ రద్దు
- February 28, 2023
యూఏఈ: "తీవ్రమైన నియంత్రణ దుష్ప్రవర్తన" కారణంగా అల్ రషీద్ ఎక్స్ఛేంజ్ కంపెనీ లైసెన్స్ను రద్దు చేసినట్లు యూఏఈ సెంట్రల్ బ్యాంక్ (CBUAE) వెల్లడించింది. కంపెనీ కార్యకలాపాలను పరిశీలించిన తర్వాత అక్రమాలు నిరూపణ కావడంతో ఎక్స్ఛేంజ్ హౌస్ పై చర్యలు చేపట్టినట్లు రెగ్యులేటర్ తెలిపింది. ఈ నెలలో లైసెన్స్ రద్దు చేయబడిన రెండవ కంపెనీ ఇది. నిబంధనలను పాటించనందుకు ఇటీవల ఫైనాన్షియల్ కంపెనీకి 1.8 మిలియన్ దిర్హామ్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే.
సెంట్రల్ బ్యాంక్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, యాక్టివిటీస్కు సంబంధించి 2018 డిక్రెటల్ ఫెడరల్ లా నంబర్ (14)లోని ఆర్టికల్ 137 ప్రకారం.. అల్ రషీద్ లైసెన్స్ను రద్దు చేసినట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ఎక్స్ఛేంజ్ హౌస్ ఉద్దేశపూర్వకంగా చెల్లింపుల టర్నోవర్ను దాచిపెట్టినట్లు, దాని లిక్విడిటీ అవసరాలను తీర్చడంలో విఫలమైనట్లు, సెంట్రల్ బ్యాంక్కు తప్పుడు సమాచారాన్ని అందించడం, తీవ్రమైన మనీలాండరింగ్ మాల్ప్రాక్టీస్లో పాల్గొనడం, అభ్యంతర పత్రాన్ని పొందకుండా లైసెన్స్ను బదిలీ చేయడం లాంటి ఉల్లంఘనలను తనిఖీల సందర్భంగా గుర్తించినట్లు యూఏఈ సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







