యూఏఈ నుంచి భారత్ కు వస్తున్నారా.. అయితే మీకు జేబుకు చిల్లే..!
- February 28, 2023
అబుధాబి: భారత్ నుంచి చాలా మంది ఉపాధి కోసం ఇతర దేశాలు వెళ్తుంటారు.రమదాన్ పండుగ సందర్భంగా యూఏఈ నుంచి స్వదేశానికి వచ్చే ఆలోచనలో ఉన్న భారతీయులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.ఎందుకంటే పండుగ సీజన్లో యూఏఈ నుంచి భారత్కు విమాన టికెట్ల ధరలు భారీగా పెరగనున్నాయి.ఏకంగా 10 నుంచి 25 శాతం మేర పెరుగుదల ఉంటుందని మీడియాకు తెలిపారు. మార్చి 23 నుంచి ప్రారంభమయ్యే రమదాన్ మాసం నుంచి విమాన ఛార్జీల పెరుగుదల నెమ్మదిగా మొదలవుతుందని అధికారులు తెలిపారు.
మార్చి 21 నుండి 30 వరకు యూఏఈ నుండి భారత్కు ఒక రౌండ్ ట్రిప్కు ఎకానమీ విమాన టికెట్ ధర సుమారు 1,316 దిర్హాములు ఉండే అవకాశం ఉంది.గతంలో వచ్చిన నష్టాలను రికవరీ చేసుకునేందుకు విమానయాన సంస్థలు ఈ పండుగ సీజన్ను ఉపయోగించుకుని ధరలు పెంచేందుకు రెడీ అవుతున్నాయట. అలాగే వేసవి ప్రారంభానికి ముందు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే చివరి నెల కాబట్టి మార్చి, ఏప్రిల్లలో ఈ సమయంలో ఇన్బౌండ్ ట్రావెల్ డిమాండ్ అత్యధికంగా ఉంటుంది.
ఇక ఈ రమదాన్ మాసంలో యూఏఈ సెలవులు ఇస్తారు.దీంతో చాలా మంది భారతీయులు ఇండియాకు వస్తారు.ముఖ్యంగా ఈ రమదాన్ ముస్లింలకు చాలా పెద్ద పండుగ కాబట్టి వారు తప్పని సారిగా భారత్కు వస్తారు.ఇలా వచ్చే వారికి ఈసారి ఖర్చు కాస్త ఎక్కువ కానుంది.కాగా, గత రెండేళ్లుగా మహమ్మారి కరోనా కారణంగా నెమ్మదించిన అంతర్జాతీయ విమాన ప్రయాణాలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి.ఇదే అదునుగా విమానయాన సంస్థలు ఛాన్స్ దొరికిన ప్రతిసారి చార్జీలు పెంచి సొమ్ము చేసుకుంటున్నాయి.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









