గల్ఫ్ దేశాల్లో చెమటోడ్చే కన్నా.. సులువుగా సంపాదించాలని అడ్డంగా బుక్కయిన వ్యక్తి
- March 03, 2023
కరీంనగర్: గల్ఫ్ దేశాల్లో చెమటోడ్చే కన్న అడ్డదారిలో డబ్బును సులువుగా సంపాదించాలని గంజాయి అమ్మకాలను చేపట్టిన ఓ వ్యక్తి పోలీసులకు అడ్డంగా దొరికిన ఉదంతం కరీంనగర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామానికి చెందిన గండికోట దేవరాజు(34)కు ఒక భార్య ఇద్దరు పిల్లలు. తన స్వగ్రామంలో ఉపాధి లేక సుమారు దశాబ్దం క్రితం ఎడారి దేశాలకు పోయాడు. ఒక దశాబ్దం పాటు సౌదీ అరేబియాలో డ్రైవర్ గా పనిచేసిన దేవరాజు తన బొటాబొటి సంపాదనతో అసంతృప్తి చెందాడు. రెండు సంవత్సరాల క్రితం తన స్వగ్రామానికి చేరుకున్నాడు. గంజాయి అమ్మకాలు చేపట్టి అడ్డదారిలో సులువుగా సంపాదించాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఒడిశా రాష్ట్ర సరిహద్దులో గతంలో ట్రాక్టర్ డ్రైవర్ గా కొంత కాలం పనిచేయడం వల్ల అక్కడ గంజాయి సాగు అమ్మకాల గురించి ఉన్న అవగాహనతో.. గంజాయి అమ్మకాలను ఎంచుకొన్నాడు. ఇటీవల కాలంలో గంజాయి క్రయవిక్రయాలపై దృష్టి సారించిన పోలీసులు.. గంజాయి అమ్ముతున్న వ్యక్తులపై నిఘా పెంచారు. దీంతో గండికోట దేవరాజు గంజాయి దందా వెలుగులోకి వచ్చింది. అతడి కదలికలపై క్షణక్షణం నిఘా పెంచిన పోలీసులు.. ఒడిశా నుంచి గంజాయిని తీసుకొస్తుండగా అతడిని రెడ్ హ్యాండెండ్ గా అరెస్టు చేశారు. అతడి దగ్గరనుంచి సుమారు లక్ష రూపాయల విలువైన 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కరీంనగర్ - 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్లు పి. దామోదర్ రెడ్డి, పి. శ్రీనివాసరావులు తెలిపారు. గంజాయి రవాణకు సాయం అందిస్తున్న కరీంనగర్ కు చెందిన మహమ్మద్ సైసల్ షరీప్, అబ్దుల్ పాబాజీ, ధరావత్ వినయ్ లను కూడా అరెస్టు చేసినట్లు వారు వెల్లడించారు.
--గుళ్ళపల్లి నారాయణ(మాగల్ఫ్ ప్రతినిధి,కరీంనగర్)
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







