యూఏఈలో తేలికపాటి భూకంపం..!
- March 03, 2023
యూఏఈ: గురువారం సాయంత్రం యూఏఈలో స్వల్ప భూకంపం సంభవించింది. కొందరు నివాసితులు భూకంప ప్రకంపనలను అనుభవించినట్లు చెబుతున్నారు. రిక్టర్ స్కేలుపై ఇది 1.9గా నమోదైంది. భూకంపం దిబ్బా అల్ ఫుజైరా తీరంలో రాత్రి 8 గంటలకు నమోదైందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (ఎన్సిఎం) తెలిపింది. అయితే, భూకంపాల గురించి యూఏఈ నివాసితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని NCM డిపార్ట్మెంట్ ఆఫ్ సిస్మోలజీ డైరెక్టర్ ఖలీఫా అల్ ఎబ్రీ తెలిపారు. "సాధారణంగా ఒక సంవత్సరంలో రెండు నుండి మూడు వరకు స్వల్ప ప్రకంపనలు వస్తుంటాయి. ఈ ప్రకంపనలు సెన్సార్ల ద్వారా మాత్రమే గుర్తించవచ్చు. ఇవి భవనాలు లేదా మౌలిక సదుపాయాలను ప్రభావితం చేయవు." అని వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయులకు బయోమెట్రిక్ డేటా మోసాలపై హెచ్చరిక
- మహిళ వద్ద రూ. 25 కోట్ల విలువైన 15.6 కిలోల గోల్డ్ సీజ్!
- విశాఖలో ఏఐజీ హాస్పిటల్ నిర్మాణానికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన
- అల్ మెన్హాద్ ఎయిర్బేస్పై క్షిపణి దాడి.. వార్తలను ఖండించిన యూఏఈ రక్షణ శాఖ
- ఇరాన్ నుంచి యూఏఈ ప్రాదేశిక జలాల్లోకి UAV.. అప్రమత్తమైన వైమానిక దళం
- సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్కు చెందిన నలుగురు అరెస్ట్..!!
- Dh964 షాపింగ్ బిల్లుతో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ గెలిచిన సేల్స్మ్యాన్..!!
- అల్ హిద్లో చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- 21 హెల్తీ సిటీలతో సౌదీ అరేబియా.. రీజియన్లో టాప్..!!
- భారత పర్యాటకులకు అబుదాబి గుడ్ న్యూస్..వీసా ఫ్రీ..!!







