యూఏఈలో తేలికపాటి భూకంపం..!

- March 03, 2023 , by Maagulf
యూఏఈలో తేలికపాటి భూకంపం..!

యూఏఈ: గురువారం సాయంత్రం యూఏఈలో స్వల్ప భూకంపం సంభవించింది. కొందరు నివాసితులు భూకంప ప్రకంపనలను అనుభవించినట్లు చెబుతున్నారు. రిక్టర్ స్కేలుపై ఇది 1.9గా నమోదైంది. భూకంపం దిబ్బా అల్ ఫుజైరా తీరంలో రాత్రి 8 గంటలకు నమోదైందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (ఎన్‌సిఎం) తెలిపింది.  అయితే, భూకంపాల గురించి యూఏఈ నివాసితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని NCM డిపార్ట్‌మెంట్ ఆఫ్ సిస్మోలజీ డైరెక్టర్ ఖలీఫా అల్ ఎబ్రీ తెలిపారు. "సాధారణంగా ఒక సంవత్సరంలో రెండు నుండి మూడు వరకు స్వల్ప ప్రకంపనలు వస్తుంటాయి. ఈ ప్రకంపనలు సెన్సార్ల ద్వారా మాత్రమే గుర్తించవచ్చు. ఇవి భవనాలు లేదా మౌలిక సదుపాయాలను ప్రభావితం చేయవు." అని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com