పసందైన మిక్స్డ్ ఫ్రూట్ రైతా
- June 19, 2015
పసందైన మిక్స్డ్ ఫ్రూట్ రైతా
కావలిసినవి
పెరుగు - 2 కప్పులు
అరటి పండు ముక్కలు - 2 కప్పులు
యాపిల్ ముక్కలు - 2 కప్పులు
దానిమ్మ గింజలు - 2 కప్పులు
పైనాపిల్ ముక్కలు 2 కప్పులు
మామిడిపండు ముక్కలు 2 కప్పులు
కొత్తిమీర తురుము - కొద్దిగా
పంచదార - రుచికి సరిపడా
మిరియాల పొడి - అర టీ స్పూను
యాలకుల పొడి - అర టీ స్పూను
ఉప్పు - తగినంత
తయారు చేసే విధానం
పెరుగులో ఉప్పు, పంచదార, మిరియాల పొడి, యాలకుల పొడి కొద్దిగా పాలు లేదా నీళ్లు పోసి బాగా గిలక్కొట్టాలి. తరువాత పైన చెప్పిన పండ్ల ముక్కలన్నీ కలిపి, చివరగా కొత్తిమీర తురుము కూడా వేసి కాసేపు ఫ్రిజ్లో పెట్టి చల్లచల్లగా సర్వ్ చేసుకోవాలి.
వేసవిలో పెరుగు తినడం చాలా అవసరం. ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికీ తెలిసిందే. అయితే కొంత మంది పెరుగును అలాగే తినమంటే అంతగా ఇష్ట పడరు. అందుకే పెరుగును ఈ రకంగా అందిస్తే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇష్టం లేని వాళ్లు కూడా లొట్టలేస్తూ తినడానికి అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







