అబుధాబిలో దారుణం..భారతీయుడిని పొడిచి చంపిన మరో భారతీయుడు!
- March 05, 2023
అబుధాబి: అబుధాబిలో దారుణం జరిగింది. ఉద్యోగం ఇచ్చిన తోటి భారతీయుడినే మరో భారత ప్రవాసుడు కత్తితో పొడిచి చంపేశాడు. శాలరీ విషయంలో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ కాస్త ఇలా ఒకరి ప్రాణం తీసింది. వివరాల్లోకి వెళ్తే.. కేరళ రాష్ట్రం మలప్పురంలోని చంగరంకుళంకు చెందిన యాసిర్ (38) అబుధాబిలో 'కలర్ వరల్డ్' అనే ఓ ప్రైవేట్ సంస్థను నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో రెండు నెలల కింద దగ్గరి బంధువైన మహమ్మద్ గసాని అనే వ్యక్తిని తన సంస్థలో గ్రాఫిక్ డిజైనర్గా నియమించుకున్నాడు.
అయితే, గడిచిన కొన్నిరోజులుగా గసాని ప్రస్తుతం తనకు ఇస్తున్న శాలరీ కంటే ఇంకా ఎక్కువ కావాలని డిమాండ్ చేస్తూ యాసిర్తో గొడవ పడుతున్నాడు.రెండు రోజుల కింద కూడా ఇదే విషయమై ఇద్దరు ఆఫీస్లోనే ఘర్షణకు దిగారు.దాంతో గసాని తనతో పాటు తెచ్చుకున్న కత్తితో యాసిర్పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యాసిర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గసానిని అబుధాబి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కాగా, మృతుడు యాసిర్కు గర్భవతి అయిన భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో వారు కన్నీరుమున్నీరు అవుతున్నారు. యాసిర్ స్వస్థలం చంగరంకుళంలో విషాదం అలుముకుంది.
తాజా వార్తలు
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!